E-Paper
Advertisement

Lok Sabha polls : మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారం షురూ.. ఎక్కడి నుంచో తెలుసా?

Lok Sabha polls : జనవరి 13 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాయి.

Lok Sabha polls : మోదీ లోక్ సభ ఎన్నికల ప్రచారం షురూ.. ఎక్కడి నుంచో తెలుసా?

Lok Sabha polls : జనవరి 13 నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ఇప్పటికే ప్రారంభించింది. ఇదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాయి.

ఈ క్రమంలోనే జనవరి 13 న బెతియా సిటీలోని రామ్ మైదాన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. బిహార్‌లోని చంపారన్ లో జరగనున్న బహిరంగ సభతో దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని 40 స్థానాల్లో గెలుపు కోసం బీజేపీ విస్తృత ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా బహిరంగ సభలతో ముమ్మర ప్రచారం చేపట్టనుంది. జనవరి 13న రాష్ట్ర పర్యటనతోనే ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని బేగూసరాయ్‌, బెతియా, ఔరంగాబాద్‌లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నట్లు సమాచారం.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా వచ్చే రెండు నెలల్లో బిహార్‌లో అనేక సభల్లో పాల్గొననున్నారు. జనవరి 15 తర్వాత ముమ్మర ప్రచారం ఉండనున్నట్లు సమాచారం. సీతామర్హి, మధేపురా, నలందాల్లో అమిత్‌షా పాల్గొననుండగా.. సీమాంచల్‌లో జేపీ నడ్డా పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే, కేంద్రంలో బీజేపీను ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీ కూటమి I.N.D.I.A(ఇండియా)లో బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ కీలకంగా వ్యవహరిస్తున్నారు. విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రేసులోనూ నీతీశ్‌ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×