BigTV English

Pak Spy Indian Navy: భారత నేవీలో పాక్ గూఢాచారి.. ఆపరేషన్ సిందూర్ సమాచారం కోసం క్రిప్టో పేమెంట్

Pak Spy Indian Navy: భారత నేవీలో పాక్ గూఢాచారి.. ఆపరేషన్ సిందూర్ సమాచారం కోసం క్రిప్టో పేమెంట్

Pak Spy Indian Navy| పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమం తరువాత దేశంలో పాకిస్తాన్ కోసం పనిచేసే దేశద్రోహులు, గూఢాచారుల కోసం పోలీసులు, భారత సైన్యం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ చర్యల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. భారత నౌకాదళంలో పనిచేసే ఒక ఉద్యోగిని పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్ కు అతను భారత నేవీ సమాచారం రహస్యంగా చేరుస్తున్నాడని తెలిసింది.


రాజస్థాన్ పోలీసుల ఇంటెలిజెన్స్ విభాగం బుధవారం ఢిల్లీలోని నౌకాదళ ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఒక సివిలియన్ ఉద్యోగిని అరెస్ట్ చేసింది. అతను పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి రహస్య సమాచారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అరెస్టయిన వ్యక్తి పేరు విశాల్ యాదవ్. అతను అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC)గా పనిచేస్తున్నాడు. హర్యానాలోని రేవారీ జిల్లాలోని పున్సికా గ్రామానికి చెందినవాడు. అతడిని 1923 ఆఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ సిఐడి (CID) ఇంటెలిజెన్స్ బృందం చాలా రోజులుగా అతడి కదలికలను గమనిస్తూ.. పాకిస్తాన్‌‌తో సంబంధం ఉన్న గూఢచర్య కార్యకలాపాలను పరిశీలిస్తోంది.

పాకిస్తాన్ హ్యాండ్లర్‌తో సంబంధం
సిఐడి సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ విష్ణుకాంత్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. విశాల్ యాదవ్ నౌకాదళంలోని డైరెక్టరేట్ ఆఫ్ డాక్‌యార్డ్‌లో పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ మహిళా హ్యాండ్లర్లు అతడిని సంప్రదించారు. ప్రియా శర్మ అనే మారుపేరుతో ఒక మహిళ అతడిని సంప్రదించింది. డబ్బు ఆశ చూపి, నౌకాదళ రహస్య సమాచారాన్ని తనకు అందించమని ఆమె విశాల్‌ను ప్రలోభపెట్టింది.


ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనమే కారణం
తనిఖీల్లో వెల్లడైన విషయం ఏమిటంటే.. విశాల్ యాదవ్ ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిస అయ్యాడు. ఈ వ్యసనం కారణంగా అతను డబ్బు అవసరాల కోసం రహస్య సమాచారాన్ని లీక్ చేయడం ప్రారంభించాడు. క్రిప్టోకరెన్సీ (USDT) ద్వారా అతనికి చెల్లింపులు బ్యాంకు ఖాతాలలోకి వచ్చాయి. గూఢచర్య కార్యకలాపాల్లో క్రిప్టోకరెన్సీ వాడకం గురించి ఇది ఆందోళన కలిగిస్తోంది.

ఆపరేషన్ సిందూర్ రహస్యాలు లీక్
విశాల్ యాదవ్ ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలు చేసినప్పుడు, అతను ఆపరేషన్ సిందూర్ సమయంలో కూడా నౌకాదళ రహస్య సమాచారాన్ని లీక్ చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. అతని చాట్ రికార్డులు, డాక్యుమెంట్‌లు ఈ విషయాన్ని నిర్ధారించాయి. దీనివల్ల అతను ఎక్కువ కాలంగా గూఢచర్యంలో పాల్గొన్నాడని తెలిసింది.

జైపూర్‌లో విచారణ
ప్రస్తుతం విశాల్ యాదవ్‌ను సిఐడి పోలీసులు జైపూర్‌లోని ఒక సురక్షిత ప్రాంతంలో రహస్యంగా ఉంచారు. అతడిని దేశానికి చెందిన మల్టీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు విచారణ చేస్తున్నాయి. అతడిని సహకరించిన ఇతరులు ఎవరు? లీక్ అయిన సమాచారం ఎంత వరకు వెళ్లింది అనే విషయాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

Also Read: దేశ సేవ చేసినా శిక్ష అనుభవించాల్సిందే.. సైనికుడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రజలకు హెచ్చరిక
భద్రతా సంస్థలు ప్రజలకు ఒక హెచ్చరిక విడుదల చేశాయి. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా సంప్రదింపులు గమనిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించాయి. ఈ ఘటన నౌకాదళ రహస్యాల భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా, క్రిప్టోకరెన్సీ వంటి ఆధునిక సాంకేతికతలను గూఢచర్యానికి ఉపయోగించడం దేశ భద్రతకు కొత్త సవాళ్లను తెచ్చిపెడుతోంది.

Related News

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

MP News: పట్టించుకోని వాహనదారులు.. పెట్రోల్ కష్టాలు రెట్టింపు, ఏం జరిగింది?

Big Stories

×