BigTV English

Viksit Bharat Rozgaar Yojna: యువత కోసం కేంద్రం కొత్త స్కీమ్.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన

Viksit Bharat Rozgaar Yojna: యువత కోసం కేంద్రం కొత్త స్కీమ్.. ఎర్రకోటపై ప్రధాని మోదీ ప్రకటన

Viksit Bharat Rozgaar Yojna: దేశంలో యువతపై వరాల జల్లు కురిపించారు ప్రధాని నరేంద్ర మోదీ. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై శుక్రవారం ఉదయం మాట్లాడిన ప్రధాని, యువతకు వరాల జల్లు కురిపించారు. ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా లక్ష కోట్ల విలువైన వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రకటించారు. 2047 నాటి లక్ష్యాలు చేరుకోవాలంటే యువతకు మరింత ప్రోత్సాహం ఉండాలన్నారు. ఈ నేపథ్యంలో కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు.


స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి యువతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు లక్ష కోట్ల వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ ఈ ఏడాది ఆగస్టు ఒకటి నుంచి జులై 31, 2027 వరకు అంటే రెండేళ్లు అమలులో ఉంటుంది.

ఈ పథకం ద్వారా మూడున్నర( 3.5) కోట్ల యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఆ లెక్కన దాదాపు 1.92 కోట్ల మంది మొదటిసారి ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశించనున్నారు.  మొదటిసారి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందిన యువతకు కేంద్ర ప్రభుత్వం నుంచి 15 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనుంది.


ఈ మొత్తాన్ని రెండు వాయిదాల్లో చెల్లించనున్నారు. ఉద్యోగంలో జాయిన్ అయిన 6 నెలల తర్వాత తొలి వాయిదా చెల్లించనున్నారు. ఏడాది తర్వాత ఆర్థిక సాక్షరత కార్యక్రమం పూర్తి చేసినవారికి రెండో వాయిదా చెల్లిస్తారు. అయితే ఈ మొత్తాన్ని ఆధార్ బ్రిడ్జ్ పేమెంట్ సిస్టమ్-ABPS ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్-DBT రూపంలో అందజేయనుంది.

ALSO READ: ఎర్రకోటపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు, సోషల్ మీడియాపై దృష్టి

యువతలో ఆర్థిక సాక్షరతను పెంపొందించడంతోపాటు సొమ్మును స్థిర ఆదాయ సాధనలో ఉంచి విత్‌డ్రా చేసుకునే సౌలభ్యాన్ని అందించనుంది. వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన పథకాన్ని రెండు భాగాలుగా విభజించారు ప్రధాని మోడీ. తొలుత కొత్తగా ఉద్యోగంలోకి వచ్చినవారిపై దృష్టి సారిస్తుంది.

వారంతా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFOలో నమోదు చేసుకొని ఉండాల్సిందే. నెల జీతం లక్షకు మించకూడదు. రెండోది యజమానులకు సంబంధించినది. కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి ప్రోత్సాహకాలను కేంద్రం అందించనుంది.

50 కంటే తక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు కనీసం రెండు అదనపు ఉద్యోగులను నియమించాలి. 50 లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు కనీసం ఐదు అదనపు ఉద్యోగులను నియమించుకోవాలి. యజమానులకు నెలకు 3 వేలు చొప్పున రెండేళ్లపాటు ప్రొత్సాహకాలు ఇవ్వనుంది. తయారీ రంగంలో అయితే మూడు, నాలుగో ఏడాది కూడా ప్రోత్సాహకాలు ఇవ్వనుంది.

 

Related News

TVK Vijay: తొక్కిసలాటలో 41 మంది మృతి.. స్పందించిన టీవీకే చీఫ్ విజయ్

Asia Cup Trophy: పెద్ద ప్లానింగే.. బీజేపీ స్క్రిప్ట్ ప్రకారమే భారత్ ఆసియా కప్ తీసుకోలేదా?

Karur Stampade: కరూర్ తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో కీలక విషయాలు..

TVK Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన.. ఎఫ్ఐఆర్ లో కనిపించని విజయ్ పేరు.. డీఎంకే వ్యూహమేంటి?

Jan Dhan Account Re-KYC: జన్‌ధన్ బ్యాంక్ అకౌంట్.. మంగళవారంతో క్లోజ్, వెంటనే ఆ పని చేయండి

Whiskey Sales: దేశంలో విస్కీ అమ్మకాల లెక్కలు.. టాప్‌లో సౌత్ రాష్ట్రాలు, ఏపీ-తెలంగాణల్లో ఎంతెంత?

Chennai News: కరూర్ తొక్కిసలాట ఘటన.. రంగంలోకి జస్టిస్ అరుణ జగదీశన్, ఇంతకీ ఎవరామె?

Chennai News: విజయ్ పార్టీ సంచలన నిర్ణయం.. హైకోర్టులో పిటిషన్, సీబీఐ విచారణ కోసం?

Big Stories

×