E-Paper
Advertisement

Ramadan Celebration 2024: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్గాల వద్ద సందడి!

Ramadan Celebration 2024: దేశవ్యాప్తంగా రంజాన్‌ వేడుకలు.. ఈద్గాల వద్ద సందడి!

Ramadan Festival celebrations 2024: దేశ వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రధ్దలతో ప్రార్ధనలు చేశారు. ఢిల్లీ, హైదరాబాద్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, సహా పలు రాష్ట్రాల్లో ఉదయం నుంచే రంజాన్ సందడి మొదలైంది. ఇఫ్తార్ పార్టీలు జోరుగా సాగుతున్నాయి. ముస్లిం సోదరులు ఉదయం నుంచి ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్దనలు చేసుకున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చార్మినార్, మక్కా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్దనలు చేశారు.

రంజాన్ పండుగ విశేషాలు.. ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెలలో అత్యంత పవిత్రంగా జరిగే పండుగ రంజాన్ .. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం, ప్రార్ధన, ప్రతిబింబానికి చిహ్నంగా రంజాన్ ను పరిగణిస్తారు. ఇస్లాంలోని ఐదు మూల స్తంభాలలో ఒకటిగా రంజాన్ ను పరిగణించాలని ప్రవక్త చెబుతారు. సోమ్ అని పిలువబడే ఉపవాసం తెల్లవారుజామున ప్రారంభమై సూర్యాస్తమయానికి ముగుస్తుంది.

Also Read: మూడో విడత ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ..

ఈ మాసం అంతా ముస్లింలు ఆహారం, పానీయాలకు దూరంగా ఉంటారు. దీని వల్ల క్రమశిక్షణ, ఆధ్యాత్మక పెరుగుతాయి. తెల్లవారుజామున సుహూర్, సూర్యాస్తమయం తరువాత చేసే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. దాతృత్వం, మంచి పనులకు రంజాన్ అత్యుత్తమ సమయం. రాత్రి సమయంలో ప్రార్దనలను మసీదులో తరావీహ్ పేరుతో చేస్తారు. రంజాన్ చివరి పది రోజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈద్ అల్-ఫితర్ పండుగతో రంజాన్ మాసం ముగుస్తుంది.

ఈద్ అల్-ఫితర్ ఆచారం ఎలా వచ్చిందంటే.. ఈద్ అల్-ఫితర్ సమయంలో తీపి వంటకాలు చేసుకుని ముఖ్యంగా ఖీర్ ను తయారు చేస్తారు. ఇంట్లో తయారు చేసిన రక రకాల వంటకాలు ప్రేమగా వడ్డిస్తారు. ఈ పండుగ సందర్భంగా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నవారు అల్లాను ఆరాధించడానికి.. అతని మార్గాన్ని అనుసరించడానికి ఈ పండుగను జరుపుకుంటారు.

Tags

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×