E-Paper
Advertisement

Bournvita: హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి బోర్న్ విటాను తొలగించండి.. కేంద్రం కీలక ఆదేశాలు

Bournvita: హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి బోర్న్ విటాను తొలగించండి.. కేంద్రం కీలక ఆదేశాలు
Advertisement

Bournvita: కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్న్ విటా సహా ఇతర పానీయాలను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలే బోర్న్ విటాలో పరిమితికి మంచి అధికంగా చక్కర స్థాయిలు ఉన్నాయని ఎన్‌సీపీసీఆర్ నిర్థారించిన విషయం తెలిసిందే.

చాక్లెట్ మాల్ట్ డ్రింక్ మిశ్రమాల బ్రాండ్ లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు తయారీ కంపెనీల వెబ్ సైట్ లు, ఇతర మాద్యమాల్లో పలు చాక్లెట్ మాల్ట్ డ్రింక్ ఉత్పత్తులు ప్రస్తుతం హెల్త్ డ్రింక్స్ అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈకామర్స్ కంపెనీలకు ఆ హెల్త్ డ్రింక్ అనే పదాన్ని వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఇటీవలే సీఆర్‌పీసీ-2005 చట్టంలోని సెక్షన్-14 కింద బోర్న్ విటాపై విచారణ చేపట్టింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం 2006లో హెల్త్ డ్రింక్ అని దేన్నీ నిర్థారించలేమని కేంద్రం ఏప్రిల్ 10న ప్రకటించింది.

ఇటీవలే ఓ యూట్యూబర్ బోర్న్ విటాలో చక్కెర స్థాయిలు కేంద్రం నిర్దేశించిన స్థాయికి మంచి ఉన్నాయంటూ ఓ వీడియోను విడుదల చేశారు. దీనిపై సదురు యూట్యూబర్ ఎన్‌సీపీసీఆర్ కు కూడా ఫిర్యాదు చేశాడు. బోర్న్ విటా హెల్త్ డ్రింక్ అంటూ ప్రచారం చేస్తుండడంతో అది చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

Also Read: బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..!

అయితే ఆ యూట్యర్ చేసిన ఫిర్యాదును ఎన్‌సీపీసీఆర్ స్వీకరించి.. విచారణకు ఆదేశించింది. ఈ ఎన్‌సీపీసీఆర్ బోర్న్ విటా సంస్థపై విచారణ జరిగి.. అనుమతించిన దానికంటే అధికంగా చక్కెర స్థాయిలు ఉన్నట్లు గుర్తించింది. ఈ తరుణంలో కేంద్రం బోర్న్ విటా, ఇతర పానీయాలు, బేవరేజెస్ ను హెల్త్ డ్రింక్స్ కేటగిరి నుంచి తొలగించాలంటూ ఈ-కామర్స్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. వెంటనే వీటిని అమలు చేయాలని స్పష్టం చేసింది.

Tags

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×