BigTV English

PM Narendra Modi: ప్రభుత్వ జోక్యం లేని సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: ప్రధాని మోదీ

PM Narendra Modi: ప్రభుత్వ జోక్యం లేని సమాజాన్ని సృష్టించడమే లక్ష్యం: ప్రధాని మోదీ
society without government interference
 

society without government interference: ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉండే సమాజాన్ని సృష్టించడమే తన లక్ష్యమని, ప్రజల శ్రేయస్సును నిర్ధారించడానికి ఇది ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద గ్లోబల్‌ టెక్స్‌టైన్ ఈవెంట్‌ల్లో ఒకటైన భారత్‌ టెక్స్‌ 2024లో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు.


ఈ ఈవెంట్‌ను ఢిల్లీలోని భారత మండపం వేదికగా సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 100దేశాల నుంచి ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎల్లప్పుడు పేదలకు అండగా ఉండాలి అన్నారు.

Read More: ఉచిత విద్యుత్ పథకం సబ్సిడీ వివరాలివే.. అర్హులెవరో తెలుసుకోండి..


ప్రభుత్వం నుంచి జోక్యం లేని సమాజాన్ని మనం సృష్టించాలి అన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి జీవితాల్లో జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా తాను ప్రభుత్వ జోక్యం లేకుండా ఉండే సమాజాన్ని సృష్టించడానికి పోరాడుతున్నానని అన్నారు.

రాబోయే ఐదేళ్లలో కూడా ఇదే కృషిని కొనసాగిస్తానని తెలిపారు. దేశంలో శ్రేయస్సును నిర్ధారించడంలో ప్రభుత్వం ఉత్ప్రేరక ఏజెంట్‌గా పనిచేయాలని ఆయన చెప్పారు. దేశాన్ని ‘వికసిత్‌ భారత్‌’గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×