E-Paper
Advertisement

Road Accident: అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి

Road Accident: అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి

Road Accident In West Bengal: పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురూలియా జిల్లాలో శనివారం పలు వాహనాలను ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్ తరలిస్తున్న ట్రక్కు మొదట బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

వెంటనే డ్రైవర్ ను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. దాంతో త్రీ వీలర్ ను ట్రక్కు మరో సారి ఢీ కొట్టింది. ఆ తర్వాత పాద చారులను ఢీ కొన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..నితుడియా పోలీస్ స్టేషన్ పరిధిలో సద్వాడి మోడ్ ప్రాంతంలో నివసించే కొందరు వగర్దంగా గ్రామంలోని ఓ వివాహ వేడుకకు వెళ్లి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే..భమురియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను ఢీ కొట్టింది.

ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శ్యామపాడ్ (74), భాగ్యవతి మండల్ (63),మృదుల్ మండల్ (45). ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలవగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఐదుగురు మృతి చెందగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలు నిలిపివేత

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు ట్రక్కును వెంబడించి పర్వేలియా గ్రామం వద్ద ఆపి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

Big Stories

×