E-Paper
Advertisement

Road Accident: అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి

Road Accident: అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి
Advertisement

Road Accident In West Bengal: పశ్చిమ బెంగాల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురూలియా జిల్లాలో శనివారం పలు వాహనాలను ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు నిర్మాణం కోసం కాంక్రీట్ తరలిస్తున్న ట్రక్కు మొదట బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడిపే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

వెంటనే డ్రైవర్ ను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. దాంతో త్రీ వీలర్ ను ట్రక్కు మరో సారి ఢీ కొట్టింది. ఆ తర్వాత పాద చారులను ఢీ కొన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం..నితుడియా పోలీస్ స్టేషన్ పరిధిలో సద్వాడి మోడ్ ప్రాంతంలో నివసించే కొందరు వగర్దంగా గ్రామంలోని ఓ వివాహ వేడుకకు వెళ్లి ఆటోలో స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే..భమురియా గ్రామ సమీపంలో ట్రక్కు ఆటోను ఢీ కొట్టింది.

Advertisement

ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు శ్యామపాడ్ (74), భాగ్యవతి మండల్ (63),మృదుల్ మండల్ (45). ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలవగా స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఐదుగురు మృతి చెందగా..మరో ఆరుగురికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: దుమ్ము తుఫాను.. ఇద్దరు మృతి.. విమాన రాకపోకలు నిలిపివేత

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు ట్రక్కును వెంబడించి పర్వేలియా గ్రామం వద్ద ఆపి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

Big Stories

Advertisement
×