BSNL 2399 Plan: రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఇటీవల రీఛార్జ్ ధరలను పెంచిన నేపథ్యంలో.. BSNL తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఆఫర్ను తీసుకువచ్చింది. ప్రైవేట్ కంపెనీల ఛార్జీల భారాన్ని తగ్గించుకోవడానికి చాలామంది BSNL వైపు మొగ్గు చూపుతున్న ఈ సమయంలో.. ఆ సంస్థ నుంచి వచ్చిన ప్రకటన వినియోగదారులకు ఎంతో ఊరటనిస్తోంది. తమ పాపులర్ రూ.2,399 వార్షిక ప్లాన్పై మరో 47 రోజుల అదనపు వాలిడిటీని అందిస్తూ ఈ పరిమిత కాల ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ఆఫర్ వల్ల వినియోగదారులకు మొత్తం 412 రోజుల పాటు సేవలు అందుతాయి. ఈ వార్షిక ప్లాన్లో భాగంగా ప్రతిరోజూ అన్లిమిటెడ్ ఉచిత వాయిస్ కాల్స్తో పాటు రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఇక డేటా విషయానికి వస్తే.. రోజుకు 2GB వేగవంతమైన డేటాను వాడుకోవచ్చు. ఒకవేళ ఆ పరిమితి పూర్తయితే.. ఇంటర్నెట్ వేగం 40 kbpsకు తగ్గుతుంది.
Also Read: సినిమా హాల్ రేంజ్ సౌండ్.. బోట్ కొత్త సౌండ్బార్లు వచ్చేశాయ్, ఫీచర్లు, ధరలు ఇవే!
ఈ అదనపు కాలపరిమితి వల్ల వినియోగదారులకు ప్రతిరోజూ అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. సాధారణంగా 365 రోజుల వాలిడిటీ ఉన్నప్పుడు రోజువారీ ఖర్చు సుమారు రూ.6.57గా ఉండేది. అయితే, ఈ ప్రమోషనల్ ఆఫర్లో భాగంగా 412 రోజులకు వాలిడిటీ పెరగడంతో.. రోజువారీ వ్యయం కేవలం రూ.5.82కి పడిపోతుంది. సుదీర్ఘ కాలం పాటు రీఛార్జ్ బాధ లేకుండా ఉండాలనుకునే వారికి ఈ ప్లాన్ బాగా సెట్ అవుతుంది.
రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని BSNL ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రవేశపెట్టినట్లు కనిపిస్తోంది. ఆగస్టు 12 నుండి సెప్టెంబర్ 12 మధ్య రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు మాత్రమే ఈ అదనపు రోజులు వర్తిస్తాయి. స్వదేశీ టెక్నాలజీతో విస్తరిస్తున్న BSNL 4G సేవలను తక్కువ ఖర్చుతో, ఎక్కువ కాలం ఉపయోగించుకోవాలి అనుకునే వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
Also Read: Apple Smart Glasses.. రికార్డింగ్ ప్రైవసీ సమస్యలకు చెక్ పెట్టేలా కొత్త పేటెంట్!