E-Paper
Advertisement

WhatsApp, Telegram, Signal: యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. స్పందించిన వాట్సప్.. అసలేం జరిగింది?

WhatsApp, Telegram, Signal: యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. స్పందించిన వాట్సప్.. అసలేం జరిగింది?
Advertisement

WhatsApp, Telegram, Signal: సోషల్ మీడియా యాప్‌లలో యూజర్ల భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌కు నోటీసులు పంపిన మరుసటి రోజే.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మరో రెండు ప్రముఖ యాప్‌లైన టెలిగ్రామ్, సిగ్నల్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ యాప్‌లలో ఉన్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం ఆందోళన:

సాధారణంగా టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లలో అవతలి వ్యక్తికి మన ఫోన్ నెంబర్ కనిపించకుండా, కేవలం ఒక ‘యూజర్‌నేమ్’ క్రియేట్ చేసుకుని మాట్లాడుకునే సదుపాయం ఉంది. అయితే ఈ ఫీచర్ వల్ల మోసాలు, ఒకరి పేరుతో మరొకరు చలామణి అయ్యే (ఇంపర్సనేషన్) అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఈ ఫీచర్‌ను ఎందుకు అనుమతించాలో చెప్పాలని, అలాగే దీని ద్వారా జరిగే మోసాలను ఎలా అరికడుతున్నారో వివరించాలని కేంద్రం ఈ నోటీసుల్లో ప్రశ్నించింది.

వాట్సప్‌కు బ్రేక్ వేసిన కేంద్రం:

Advertisement

ఇదే తరహా ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌ను తీసుకురావడానికి వాట్సప్ ప్రయత్నించగా.. కేంద్ర ప్రభుత్వం దానికి బ్రేక్ వేసింది. ఈ ఫీచర్ వల్ల ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ప్రముఖ వ్యక్తుల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి ప్రజలను మోసం చేసే ప్రమాదం ఉందని ఐటీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరణ ఇచ్చేంతవరకు ఈ ఫీచర్‌ను రోల్ అవుట్ చేయవద్దని వాట్సప్‌ను ఆదేశించింది.

Read Also: టీవీలు, లాప్‌టాప్‌లపై 80% వరకు తగ్గింపు.. రోజుకు రూ.99కే హోమ్ అప్లయెన్సెస్!

వాట్సప్ వివరణ ఏంటంటే?

Advertisement

ప్రభుత్వ నోటీసులపై స్పందించిన వాట్సప్.. తమ ప్లాట్‌ఫామ్‌పై మోసాలను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. యూజర్‌నేమ్ ఫీచర్ ఉన్నప్పటికీ లాగిన్ అవ్వడానికి ఫోన్ నెంబర్ తప్పనిసరని స్పష్టం చేసింది. అంతేకాకుండా.. గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్‌లను గుర్తించేలా కొత్త అకౌంట్, మ్యూచువల్ గ్రూప్ సభ్యులా అనే వివరాలను చూపిస్తామని వెల్లడించింది.

నిఘా నీడలో టెలిగ్రామ్:

టెలిగ్రామ్ యాప్ గత కొంతకాలంగా భారత ప్రభుత్వ నిఘాలో ఉంది. ఇటీవల నీట్ (NEET) పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ యాప్‌పై వారం రోజుల పాటు నిషేధం కూడా విధించారు. జూన్ 22న ఈ నిషేధం ముగిసిన తర్వాత సేవలు పునరుద్ధరించబడ్డాయి. ఇప్పుడు తాజాగా యూజర్‌నేమ్ వివాదంపై కేంద్రం ఐటీ చట్టాల ప్రకారం ఈ నోటీసులు జారీ చేయడంతో ఈ యాప్‌ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: చేతిలోనే మినీ థియేటర్.. 9 స్పీకర్లు, 10,200mAh బ్యాటరీతో Lenovo కొత్త ట్యాబ్ వచ్చేసింది!

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×