Desert Sand Bricks: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) నిర్మాణ రంగంలో ఒక కొత్త విప్లవానికి తెరతీసింది. ఎడారిలో విస్తారంగా దొరికే ఇసుకను వినియోగించుకుంటూ పర్యావరణహిత ఇటుకలను తయారు చేసే ప్రత్యేక సాంకేతికతను అక్కడి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ వినూత్న విధానం వల్ల భవన నిర్మాణాల్లో వాడే సిమెంట్ వినియోగాన్ని దాదాపు సగానికి తగ్గించవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.
సాధారణంగా ఎడారి ఇసుక రేణువుల పరిమాణం, ఆకారం వల్ల దానిని భవన నిర్మాణాలకు నేరుగా ఉపయోగించడం చాలా కష్టం. అయితే యుఏఈ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ కొత్త పద్ధతిలో ఎడారి ఇసుకను ప్రత్యేక పదార్థాలతో కలిపి గట్టి ఇటుకలుగా మారుస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల సాంప్రదాయ ఇటుకల కంటే అత్యంత బలంగా ఉండే ఇటుకలు రూపుదిద్దుకుంటున్నాయి. అత్యంత వేడిని, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యం ఈ ఇటుకలకు ఉండటం విశేషం.
సిమెంట్ తయారీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున కార్బన ఉద్గారాలు వెలువడుతుంటాయి. ఇది పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తోంది. యుఏఈ తీసుకొచ్చిన ఈ కొత్త ఇటుకల తయారీ విధానం వల్ల నిర్మాణంలో అవసరమయ్యే సిమెంట్ పరిమాణం దాదాపు 50 శాతం వరకు తగ్గనుంది. దీని ద్వారా కర్బన ఉద్గారాలను విశేషంగా తగ్గించవచ్చని ఇది వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని పర్యావరణ వేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వరల్డ్ ఫేమస్ వ్యక్తులు.. చనిపోయినా వదల్లేదు.. సమాధులు తవ్వి శరీర భాగాలు ఎత్తుకెళ్లారు!
మరోవైపు ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే.. నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎడారి ప్రాంతాల్లో ఇసుక ఉచితంగా, భారీగా లభ్యమవుతుంది కాబట్టి ముడిసరుకు రవాణా ఖర్చులు కూడా తగ్గుతాయి. అలాగే సిమెంట్ వినియోగం తగ్గడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం సగానికి పైగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పర్యావరణహిత ఇటుకలను వాణిజ్యపరంగా విస్తృతంగా ఉత్పత్తి చేసి భవిష్యత్ నిర్మాణాల కోసం ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: పరువు కోసం మేనకోడల్ని చంపిన మామ.. ఆత్మ వెంటాడకుండా ఉండేందుకు మేకులు, ఉప్పుతో కలిపి