Xiaomi 18 Ultra: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ ప్రియులకు నిరాశ కలిగించే వార్త ఒకటి బయటకు వచ్చింది. Xiaomi 18 Ultra మోడల్ను కంపెనీ రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం స్మార్ట్ఫోన్ భాగాల తయారీ ఖర్చులు భారీగా పెరగడమేనని తెలుస్తోంది. ఈ ఒక్క నిర్ణయంతో చైనాకు చెందిన ఇతర ప్రముఖ బ్రాండ్లు కూడా తమ ప్రీమియం ఫోన్ల వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కనిపిస్తోంది.
Xiaomi 18 Ultra రద్దు కావడంతో.. కంపెనీ ఈసారి Xiaomi 18 Pro Max మోడల్ను టాప్ ఫ్లాగ్షిప్గా మార్కెట్లోకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ర్యామ్ (DRAM), స్టోరేజ్ (NAND) ధరలు విపరీతంగా పెరగడం వల్ల అల్ట్రా మోడల్ ధర సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపై షావోమీ 18 సిరీస్లో కేవలం స్టాండర్డ్, Pro, Pro Max మోడళ్లు మాత్రమే ఉండే అవకాశం ఉంది.
Also Read: 12GB ర్యామ్తో రాబోతున్న iPhone 18? యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఇక వేరే లెవెల్!
ఈ ప్రభావం కేవలం షావోమీకి మాత్రమే పరిమితం కావడం లేదు. ఒప్పో, వివో వంటి ఇతర చైనీస్ బ్రాండ్లు కూడా తమ తదుపరి Ultra సిరీస్ ఫోన్లను కేవలం చైనా మార్కెట్కే పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ మార్కెట్లో వీటిని లాంచ్ చేయడం భారంగా మారడమే అందుకు కారణం.
ఒకవేళ చైనీస్ కంపెనీలు తమ అల్ట్రా మోడళ్లను ప్రపంచ మార్కెట్లోకి తీసుకురాకపోతే.. గ్లోబల్ స్థాయిలో శాంసంగ్ Ultra ఫోన్లకు తిరుగులేని ఆధిపత్యం లభిస్తుంది. అంతర్జాతీయ వినియోగదారులకు ప్రీమియం అల్ట్రా విభాగంలో శాంసంగ్ ఒక్కటే ప్రధాన ఎంపికగా మిగిలిపోయే అవకాశం ఉంది.
అల్ట్రా బ్రాండింగ్ను షావోమీ శాశ్వతంగా పక్కన పెట్టలేదని నిపుణులు అంటున్నారు. రాబోయే రోజుల్లో స్పేర్ పార్ట్స్ ధరలు తగ్గి, పరిస్థితులు అనుకూలిస్తే ‘షావోమీ 19 అల్ట్రా’ పేరుతో మళ్లీ ఈ మోడల్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం రాబోయే రోజుల్లో ఇతర చైనీస్ బ్రాండ్ల నుంచి కూడా ‘ప్రో మ్యాక్స్’ పేరిట మరిన్ని కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు రానున్నాయి.
Also Read: అయ్య బాబోయ్.. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు వసూలు చేసే హిడెన్ చార్జీలు ఇవా?!