E-Paper
Advertisement

ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై ‘పాకిస్థాన్ పేరు’..PCB దూల తీర్చిన BCCI?

ICC Champions Trophy 2025: టీమిండియా జెర్సీపై ‘పాకిస్థాన్ పేరు’..PCB దూల తీర్చిన BCCI?
Advertisement

ICC Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ ( ICC Champions Trophy 2025 ) త్వరలోనే ప్రారంభం కానున్న తరుణంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు దూల తీర్చింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌ ( ICC Champions Trophy 2025 ) విషయంలో.. టీమిండియా, పాకిస్థాన్‌ మధ్య కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ తరునంలోనే…పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు ( Pakistan Cricket Board ) షాక్‌ ఇచ్చింది భారత క్రికెట్‌ నియంత్రణ మండలి. టీమిండియా జట్టు జెర్సీపై ఆతిథ్య దేశం అయిన ‘పాకిస్తాన్’ పేరు ముద్రించడంపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కంగు తిన్నది పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు. ఈ తరుణంలోనే… పాకిస్థాన్, దుబాయ్‌లో జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఈ వివాదం బయటపడింది. టీమిండియా జట్టు జెర్సీపై ( Indian jersey ) ‘పాకిస్తాన్’ పేరు ముద్రించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది బీసీసీఐ.

Also Read: IND vs Eng 1st Odi: అదానీ కోసం..టీమిండియా, ఇంగ్లాండ్‌ మ్యాచ్ రద్దు ?

Advertisement

ICC ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో భారత్ తమ మ్యాచ్‌ లు మొత్తం దుబాయ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉందన్న సంగతి తెలిసిందే. హై బ్రిడ్‌ మోడల్‌ కాబట్టి.. దుబాయ్‌లో టీమిండియా తన అన్ని మ్యాచ్‌ లు ఆడనుంది. ఇక ఈ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ అధికారిక హోస్ట్‌గా ఉంది. టీమిండియా మినహా అన్ని మ్యాచ్‌ లు మొత్తం పాకిస్తాన్ లో ( Pakistan ) జరుగుతాయి. ఈ తరుణంలోనే… ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ( ICC Champions Trophy 2025 ) ఆడే జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు కచ్చితంగా ఉంటుంది. అది అనవాయితీగా వస్తోంది. కానీ… టీమిండియా జట్టు జెర్సీపై ( Indian jersey ) ‘పాకిస్తాన్’ పేరు ముద్రించడంపై బీసీసీఐ వెనక్కి తగ్గింది.

భారత్‌ ( Team India), పాకిస్థాన్‌ దేశాల మధ్య సరిహద్దు సమస్యలు కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా జట్టు జెర్సీపై ‘పాకిస్తాన్’ పేరు ముద్రిస్తే.. వివాదాలు పెరిగే ఛాన్సు ఉంది. ఇదే అంశాన్ని బీసీసీఐ చెబుతోంది. అటు ఐసీసీకి ( ICC ) కూడా తెలియజేసింది బీసీసీఐ ( BCCI ). ఆ తర్వాతనే.. ‘పాకిస్తాన్’ పేరు లేకుండానే… ICC ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy 2025 ) కోసం జెర్సీని విడుదల చేసిందట బీసీసీఐ. ఇంకా అధికారికంగా విడుదల చేయాల్సి ఉంది.

Advertisement

Also Read: Watch: ముసలోడే కానీ మహా ముదురు..ఈయన ముందు రోహిత్‌, కోహ్లీ పనికి రారు !

అయితే.. దీనిపై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోందట. ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే జట్ల జెర్సీలపై ఆతిథ్య దేశం పేరు కచ్చితంగా ఉండాల్సిందేనని అంటోందట పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు. అంతేకాదు.. బీసీసీఐపై ఐసీసీకి ఫిర్యాదు కూడా చేసిందట పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ( Pakistan Cricket Board ). దీంతో జెర్సీల వివాదం రాజుకుంటోంది. ఇక దీనిపై పీసీబీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, టీమ్ ఇండియా జెర్సీలపై పాకిస్థాన్ పేరును ముద్రించడానికి నిరాకరించడం దారుణం అన్నారు. అనవసరంగా ‘క్రికెట్‌లో రాజకీయాలు’ తీసుకువస్తోందని బీసీసీఐపై మండిపడ్డారు. ఇక అటు ఛాంపియన్స్ ట్రోఫీకి కర్టెన్ రైజర్ ఈవెంట్ అయిన కెప్టెన్ల మీట్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మను పాకిస్తాన్‌కు పంపడానికి భారత బోర్డు నిరాకరించిన సంగతి తెలిసిందే.

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×