Tanveer Ahmed: టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Team India vs Australia) మధ్య టి20 సిరీస్ (India tour of Ireland, 2026) జరుగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే తొలి టి20 మ్యాచ్ పూర్తి కాగా, ఇవాళ చివరి మ్యాచ్ జరగనుంది. బెల్ ఫాస్ట్ వేదికగా రెండో టి20 మ్యాచ్ కూడా జరగనుంది. ఇందులో టీమిండియా (Team India) గెలిస్తేనే సిరీస్ సమం అవుతుంది. లేకపోతే టైటిల్ ఐర్లాండ్ ఎగురేసుకు వెళ్లనుంది. ఇలాంటి క్రమంలో టీమిండియాను కించపరుస్తూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తొలి టీ20లో ఓడిపోయిన టీమ్ ఇండియా… ఇవాళ కూడా కచ్చితంగా ఓడిపోతుందని చాలెంజ్ విసిరారు. వైభవ్ కాదు, ఆ దేవుడు దిగివచ్చినా రెండో టీ20లో గెలవబోరంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. వైభవ్ ను ( vaibhav suryavanshi )దించినా, టీమిండియాను కాపాడలేరంటూ పరువు తీశారు తన్వీర్ అహ్మద్.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య ఇవాళ చిట్ట చివరి టీ20 జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరిగే రెండో టీ20లో కూడా ఐర్లాండ్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోవడం గ్యారెంటీ అన్నారు. ఇండియన్ పిచ్ ల పైన తప్ప… విదేశీ మైదానాలలో సరిగ్గా ఆడలేరని కుండబద్దలు కొట్టి చెప్పారు. అందుకే రెండో టీ20 లో కూడా టీమిండియా ఓటమి పాలు అవుతుందన్నారు. ఇవాల్టి మ్యాచ్ లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని బరిలోకి దింపేందుకు టీమిండియా యాజమాన్యం ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. అయితే ఐర్లాండ్ కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో వైభవ్ బరిలోకి దిగినప్పటికీ కూడా టీమిండియా జట్టును కాపాడలేరని కుండబద్దలు కొట్టి చెప్పారు.
టీమిండియా ప్లేయర్లు నమ్మే దేవుడు దిగివచ్చిన కూడా ఇవాళ ఐర్లాండ్ చేతిలో ఓటమి తప్పదని హెచ్చరించారు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉండి ఉంటే, టీమిండియా గెలిచేది కావచ్చు.. కానీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా గెలవడం అసాధ్యమన్నారు. ప్రస్తుతం ఉన్న టీమిండియా సభ్యులలో ఎవరు ఫోకస్ గా ఆడటం లేదని తేల్చి చెప్పారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా రానించి టైటిల్ గెలిచారు.. కానీ ఈ టైటిల్ గెలిచిన తర్వాత ఒక్కొక్కరికి పొగరు పెరిగిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పొగరుతోనే టీమిండియా మొన్న ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది అన్నారు. ఇవాళ రెండో మ్యాచ్ లో ఓడిపోయి సిరీస్ కోల్పోవడం గ్యారంటీ అని స్పష్టం చేశారు.