Champions Trophy 2025: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు ( Champions Trophy 2025 ) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) సంచలన నిర్ణయం తీసుకుంది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పాకిస్థాన్ రాణించేందుకు రంగంలోకి ఓ డేంజర్ ఆటగాన్ని దించింది. మాజీ పాకిస్తాన్ పేస్ బౌలర్ వాహబ్ రియాజ్ కు కీలక బాధ్యతలు ఇచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. మాజీ పాకిస్తాన్ పేస్ బౌలర్ వాహబ్ రియాజ్ కు పాకిస్థాన్ జట్టు సూపర్ వైజర్ గా బాధత్యలు ఇచ్చారు.
Also Read: Ganguly on Rohit Sharma: కొడుకు పుడితే..మ్యాచ్ ఆడవా ? – రోహిత్ పై గంగూలీ సీరియస్ !
Also Read: Rohit Sharma Baby: మరోసారి తండ్రైన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ
చాంపియన్స్ ట్రోపీ ఈవెంట్ సూపర్వైజర్ & పాకిస్తాన్ టీమ్ మెంటార్గా వహాబ్ రియాజ్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కాగా… ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ను ( Champions Trophy 2025 ) నిర్వహించేందుకు రెడీ అవుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. వచ్చే ఏడాది జరిగే ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కి పాకిస్థాన్ ఆతిధ్యం ఇవ్వాలి.
Also Read: IND vs SA 4th T20i: సౌతాఫ్రికా చిత్తు..135 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ !
1997 తర్వాత మొదటిసారిగా ICC ఈవెంట్ను పాకిస్తాన్ నిర్వహించబోతోంది. ఈ తరుణంలోనే.. ఆ దేశంలో ఉన్న స్టేడియంలను డెవలప్ చేస్తున్నారు. అక్కడ భద్రతపై సాధారణం కంటే ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతోంది. విదేశీ జట్లు వస్తే.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: IPL 2025 Auction: BCCI కొత్త రూల్స్.. IPL 2025 మెగా వేలం నుంచి ఈ ప్లేయర్లు ఔట్ !
అయితే.. ఈవెంట్ షెడ్యూల్ను ICC ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరిలో మాత్రం ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) జరుగనుంది. ఈ తరునంలోనే.. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025 ) కోసం పాకిస్థాన్ వెళ్లబోమని… టీమిండియా ప్రకటించింది. హై బ్రిడ్ మోడల్ లో .. నిర్వహించాలని కోరింది బీసీసీఐ. దీంతో దుబాయ్, లేదా దక్షిణాఫ్రికా వేదికగా ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నిర్వహించే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఒక వేళ ఇదే జరిగితే.. పాకిస్థాన్ కు భారీ నష్టం తప్పదు. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board ) కూడా సీరియస్ గా వ్యవహరిస్తోంది. టీమిండియా కచ్చితంగా పాకిస్థాన్ కు ( Pakistan ) రావాలని కోరుతోంది. వస్తే.. వాళ్లను బాగా చూసుకుంటామని చెబుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇలాంటి తరుణంలోనే.. మాజీ పాకిస్తాన్ పేస్ బౌలర్ వాహబ్ రియాజ్ కు పాకిస్థాన్ జట్టు సూపర్ వైజర్ గా బాధత్యలు ఇచ్చారు.