Ms Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) బ్యాటింగ్ ఆర్డర్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. లోయర్ ఆర్డర్లో మహేంద్రసింగ్ ధోని ఎందుకు వస్తున్నాడని… అలా వచ్చి జట్టుకు ఏం ప్రయోజనం చేస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( Royal Challengers Bangalore vs Chennai Super Kings ) మధ్య.. శుక్రవారం రోజున కీలక మ్యాచ్ జరిగింది.
Also Read: Nitish Kumar Reddy: కట్టలు తెంచుకున్న కోపం.. హెల్మెట్ విసిరేసిన నితీష్.. వీడియో వైరల్!
ఇప్పటికే మొదటి మ్యాచ్ విజయం సాధించిన చెన్నై… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై ( Royal Challengers Bangalore ) గెలుస్తుందని అందరూ అనుకున్నారు. చెన్నైలోనే మ్యాచ్ జరగడంతో.. ఆర్సిబి చిత్తు అవుతుందని అనుకుంటే.. సీన్ రివర్స్ అయింది. చివర్లో వికెట్లు పడడం… ఆస్కింగ్ రేట్ విపరీతంగా పెరగడం.. కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ).. ఓటమిపాలైంది. అయితే ఇక్కడ ప్రత్యేక విషయం ఏంటంటే మహేంద్ర సింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) బ్యాటింగ్ ఆర్డర్. నిన్నటి మ్యాచ్ లో తొమ్మిదవ వికెట్ కు మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ కు వచ్చాడు.
ఆ సమయంలో బ్యాటింగ్ వస్తే ఏ ప్లేయర్ ఆడలేదు. అప్పటికే మ్యాచ్ కూడా చేతులు దాటిపోతుంది. అయినప్పటికీ మహేంద్రసింగ్ ధోని 16 బంతుల్లోనే 30 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు మూడు బౌండరీలు ఉన్నాయి. అంటే మహేంద్ర సింగ్ ధోని మంచి క్లిక్ లో ఉన్నాడు. అయితే తొమ్మిదవ ఆర్డర్ లో బ్యాటింగుకు వచ్చిన మహేంద్ర సింగ్ ధోని.. ట్రోలింగుకు గురవుతున్నాడు. శివం దూబే అవుట్ అయిన వెంటనే… రవీంద్ర జడేజా అలాగే రవిచంద్రన్ అశ్విన్ కూడా వచ్చారు. అప్పుడు మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కు దిగితే.. చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ కొట్టేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Also Read: Anchor breaks TV: ఏంట్రా పంత్ అంటే ఇంత కోపమా.. టీవీ పగులగొట్టిన ఫ్యానలిస్ట్ ?
ధోని మంచి క్లిక్ లో ఉన్నాడు కాబట్టి… ఆ సమయంలో.. ధోని మరికొన్ని పరుగులు త్వరగా చేసి ఉంటే మ్యాచ్ అవలీలగా చెన్నై సూపర్ కింగ్స్ గెలిచేది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అలాకాకుండా మహేంద్రసింగ్ ధోని 9వ స్థానానికి వచ్చి… సెల్ఫిష్ ల బిహేవ్ చేశాడని.. కొంతమంది అభిమానులు కూడా ఫైర్ అవుతున్నారు. అటు టీమిండియా మాజీ ప్లేయర్లు, విదేశీ మాజీ క్రికెటర్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధోని కాస్త ముందు బ్యాటింగ్కు దిగితే బాగుండేదని.. సూచనలు చేస్తున్నారు. అభిమానుల కోసమైనా ధోని ముందు బ్యాటింగ్ చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
Your views on MS Dhoni batting at No. 9 in today's game? 👀💬✍️#MSDhoni #IPL2025 #CSKvRCB #Sportskeeda pic.twitter.com/7Zof2O6thW
— Sportskeeda (@Sportskeeda) March 28, 2025