Shoaib Akhtar On Bumrah: పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్లు వరుసగా గాయాల పాలు అవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. పాకిస్తాన్ తో పోల్చితే, టీమిండియా ఆర్థికంగా చాలా బలంగా ఉందని.. కానీ ప్లేయర్లు మాత్రం బీసీసీఐని మోసం చేస్తున్నట్లు బాంబు పేల్చారు. యార్కర్ల కింగ్ గా పేరుగాంచిన బూమ్రా కూడా వరుసగా గాయాల బారిన పడడం దారుణం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అతడు డ్రామాలాడుతున్నాడా ? లేక నిజంగా గాయం అయిందో తెలియదు కానీ, ఒక ఆటగాడికి ఇంతలా గాయాలు కావడం మాత్రం తాను మొదటిసారి చూస్తున్నానని వ్యాఖ్యానించారు. దీనిపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టకపోతే… టీమిండియా పరిస్థితి అత్యంత దారుణంగా తయారవుతుందని వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar).
వరుసగా గాయాల బారిన పడుతున్న బుమ్రా ( Jasprit Bumrah ) గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar ) కూడా రియాక్ట్ అయ్యారు. బుమ్రా ( Jasprit Bumrah) టాలెంట్ ఉన్న బౌలర్ అంటూ కితాబు ఇచ్చిన షోయబ్ అక్తర్, అదే సమయంలో తమ పాకిస్తాన్ బౌలర్ల లెవెల్ కు పనికిరాదని పరువు తీశారు. వసీం అక్రమ్ ( Wasim Akram), వకార్ యూనిస్ ( Waqar Younis) లాంటి బౌలర్లతో అస్సలు బుమ్రాను పోల్చకూడదని కోరారు. వాళ్లు అత్యున్నత బౌలర్లు అని ప్రశంసించారు.
జాతీయ జట్టు కోసం రేయింబవళ్లు కష్ట పడ్డారని గుర్తు చేశారు. గాయల పేరుతో ఎప్పుడూ జాతీయ జట్టును మోసం చేయలేదని షాకింగ్ ఆరోపణలు చేశారు. కానీ బుమ్రా… ఐపీఎల్ ( IPL ) సమయంలో చాలా ఆక్టివ్ గా కనిపిస్తూ… జాతీయ జట్టుకు ఆడేటప్పుడు గాయాలు చూపిస్తున్నాడని ఆగ్రహించారు. అలాంటోడిని తమ పాకిస్తాన్ దిగ్గజ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్ లతో పోల్చకూడదని ఫైర్ అయ్యారు.
గాయాల పేరుతో డ్రామాలు ఆడడం చాలా నేరమని కూడా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) షాకింగ్ కామెంట్స్ చేశారు. టీమిండియా తరఫున ఆడ లేకపోతే వెంటనే రిటైర్మెంట్ ఇవ్వచ్చు కదా ? అంటూ సూచనలు చేశారు. కానీ జాతీయ జట్టును మోసం చేయడం మాత్రం, దారుణమని వ్యాఖ్యానించారు. దీనిపై బుమ్రా ఒక్కడే కాదు మిగతా క్రికెటర్లు కూడా ఆలోచన చేయాలని కోరారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.