BigTV English
Advertisement

Kho Kho World Cup final: ఖో ఖో వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత ఇరుజట్లు.. నేపాల్ తో అమీతుమీ!

Kho Kho World Cup final: ఖో ఖో వరల్డ్ కప్ ఫైనల్లోకి భారత ఇరుజట్లు.. నేపాల్ తో అమీతుమీ!

Kho Kho World Cup final: స్వదేశంలో జరుగుతున్న మొట్టమొదటి ఖో ఖో ప్రపంచకప్ లో భారత మహిళల, పురుషుల జట్లు సెమీఫైనల్ కి దూసుకు వెళ్ళాయి. దేశీయ క్రీడల్లో దుమ్ము రేపుతున్న మన జట్లు క్వార్టర్స్ లో అదే ఆధిపత్యాన్ని కనబరిచాయి. భారత మహిళల, పురుషుల జట్లు ఈ మెగా టోర్నిలో ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా చవిచూడకుండా తిరుగులేని టీమ్స్ గా కొనసాగుతున్నాయి.


Also Read: Sanju Samson- BCCI: సంజూ శాంసన్ కి బిగ్ షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు!

శనివారం ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత మహిళా జట్టు ఖో ఖో ప్రపంచకప్ 2025 ఫైనల్ కీ చేరుకుంది. భారత టీమ్ 66 – 16 పాయింట్ల తేడాతో దక్షిణాఫ్రికాని చిత్తు చేసింది. మొదటి టర్న్ లో డిఫెండింగ్ క్యూ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దక్షిణాఫ్రికా కీలక పాయింట్లు సాధించింది. స్కోర్ 10-5 తో ఐదు పాయింట్ల ఆదిత్యంలో దక్షిణాఫ్రికా నిలిచింది. ఇక రెండోవ టర్న్ లో అటాకింగ్ చేసిన భారత మహిళా జట్టు మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి 33-10 తో 23 పాయింట్ల అధిక్యంలోకి వచ్చింది.


మూడవ టర్న్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా మరో ఆరు పాయింట్లను సాధించి 16 పాయింట్లకు చేరింది. ఇక చివరి టర్న్ లో భారత్ మరోసారి అటాక్ చేసి 66 – 16 తో 50 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఖో ఖో ప్రపంచ కప్ 2025 ఫైనల్ కీ చేరుకుంది. ప్రియాంక ఇంగ్లే కెప్టెన్సీలోని భారత మహిళా జట్టు ఆదివారం జరిగే ఫైనల్ లో నేపాల్ మహిళలతో తలపడతారు.

భారత మహిళా జట్టు క్వార్టర్ ఫైనల్స్ లో సహ వరుసగా ఐదు మ్యాచ్ లలో విజయం సాధించి అజేయంగా కొనసాగుతోంది. ఇక మరో మ్యాచ్ లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదటి టర్న్ లో దక్షిణాఫ్రికా పై అటాక్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ అటు అటాకింగ్, ఇటు డిఫెన్స్ లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఓ దశలో భారత్ కి షాక్ ఇచ్చేలా కనిపించింది.

Also Read: Rinku Singh: రూ.500 నోట్లు పంచుతున్న రింకూ సింగ్.. కారణం ఆ అమ్మాయేనా?

నాలుగో టర్న్ లో కుదురుకున్న మనోళ్లు దక్షిణాఫ్రికా కి చెక్ పెట్టారు. హోరాహోరీగా సాగిన ఈ పురుషుల పోరులో భారత్ 62 – 42 పాయింట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించారు. ఇక ఫైనల్ లో నేపాల్ తో భారత పురుషులు తలబడతారు. రెండవ సెమీస్ లో నేపాల్ 72-20 పాయింట్ల తేడాతో ఇరాన్ ని ఓడించింది. దీంతో నేపాల్ ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే ఫైనల్స్ లో ఇరు జట్లు నేపాల్ తోనే అమీతుమీ తేల్చుకోనున్నాయి.

 

Related News

Mohammed Shami : రూ .4 లక్ష‌లు చాల‌డం లేదు నెల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల్సిందే..ష‌మీ భార్య సంచ‌ల‌నం

IND VS AUS 5th T20I: టాస్ ఓడిన టీమిండియా..తెలుగోడిపై వేటు, డేంజ‌ర్ ఫినిష‌ర్ వ‌స్తున్నాడు

Pratika Rawal Medal : ప్రతీకా రావల్ కు ఘోర అవ‌మానం..కానీ అంత‌లోనే ట్విస్ట్‌, ICC బాస్ జై షా నుంచి పిలుపు

Hong Kong Sixes 2025: దినేష్ కార్తీక్ చెత్త కెప్టెన్సీ.. కువైట్, UAE చేతిలో వ‌రుస‌గా ఓడిన టీమిండియా

Womens World Cup 2029: వ‌చ్చే వ‌ర‌ల్డ్ క‌ప్ 2029పై ఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం..ఇకపై 8 కాదు 10 జ‌ట్లకు ఛాన్స్‌, ఫాకిస్తాన్ కు నో ఛాన్స్ !

IND VS AUS 5th T20I: నేడే చివ‌రి టీ20..టీమిండియాను వ‌ణికిస్తున్న గ‌బ్బా…సూర్య, గిల్‌ కు ఇక లాస్ట్ ఛాన్స్‌

Abhishek- Gill LV Bag: ఏంట్రా అభిషేక్‌…నీ సంచులు దేశం మొత్తం అమ్మేస్తున్నారా? లేడీస్ హ్యాండ్ బ్యాగులుగా కూడా

CP Sajjanar : వీళ్లేం సెల‌బ్రిటీలు?…రైనా, ధావన్‌లపై స‌జ్జ‌నార్ సీరియ‌స్‌

Big Stories

×