BigTV English

Maohammed Shami : వివాదంలో మొహమ్మద్ షమీ.. పక్షిప్రాణాలతో చెలగాటం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

Maohammed Shami : వివాదంలో మొహమ్మద్ షమీ.. పక్షిప్రాణాలతో చెలగాటం.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

Maohammed Shami :   టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ మధ్య కాలంలో షమీ నిత్యం వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. ఇటీవలే ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 జరిగిన విషయం తెలిసిందే. ఛాంపియన్ ట్రోఫీలో ఆడుతున్న షమీ విషయంలో ఓ వివాదం మొదలైంది. మొహమ్మద్ షమీని లక్ష్యంగా చేసుకొని ఓ ముస్లిం మత గురువు తీవ్రంగా వ్యాఖ్యానించాడు. పవిత్ర రంజాన్ మాసంలో మొహమ్మద్ షమీ పాపం చేసాడని.. అతను ఓ నేరస్తుడు అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి రంజాన్ మాసంలో రోజా పాటించకుండా షమీ పాపం చేశాడని జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా మరో వివాదం చోటు చేసుకోవడం గమనార్హం.


Also Read : Yashasvi Jaiswal : 4 క్యాచ్ లు మిస్ చేసిన జైస్వాల్ కు శిక్ష… చెరుకు మిషన్ లో చేతులు పెట్టి మరి !

పక్షిని కాపాడిన షమీ.. 


వాస్తవానికి ఓ పక్షి దాహంతో అలమటిస్తూ కింద పడిపోయింది. అయితే ఆ పక్షిని పట్టుకొని కాపాడాడు. దానికి దాహం తీర్చాడు షమీ. అయితే పక్షిని కాపాడిండు అని పొగడాల్సింది పోయి.. సోషల్ మీడియాలో షమీని ట్రోలింగ్స్ చేస్తున్నాడు. ముఖ్యంగా పక్షితో చెలగాటం ఆడుతున్నాడంటూ ట్రోలింగ్స్ చేయడం గమనార్హం. ప్రస్తుతం షమీ పక్షికి దాహం తీర్చి పైకి ఎగురవేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొహమ్మద్ షమీ ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడుతున్నాడు. హైదరాబాద్ జట్టుకి ఆడినటువంటి భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. టైటిల్ ఆర్సీబీ గెలవడంలో ఫైనల్ మ్యాచ్ లో భువనేశ్వర్ కూడా రెండు వికెట్లు తీయడం విశేషం. ముఖ్యంగా  కృణాల్ పాండ్యా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో ఫైనల్ మ్యాచ్ విజయం సాధించింది. 

లోయర్ ఆర్డర్ విఫలం..

అంతకు ముందు బ్యాటింగ్ లో కూడా  కృణాల్ ఓ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ జట్టును విజయతీరాలకు చేర్చారు. వాస్తవానికీ బ్యాటింగ్ ఆర్డర్ ప్రారంభంలో కొందరూ వికెట్లు కోల్పోయినా.. చివర్లో రాణించే ఆటగాళ్లు ఉంటేనే ఆ జట్టు విజయ సాధిస్తుంది. అలా కాకుండా కేవలం ప్రారంభం బ్యాటర్లు రాణిస్తే.. లోయర్ ఆర్డర్ విఫలం చెందితే ఆ జట్టు ఓటమి పాలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. షమీ టీమిండియా తరపున అద్భుతమైన బౌలింగ్ తో రాణిస్తున్నాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెస్ట్ సీరీస్ మ్యాచ్ కి షమీ ఎంపిక కాలేదు. షమీ మినహా.. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్  కృష్ణ, శార్దూల్ ఠాకూర్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్ వంటి బౌలర్లు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ఎంపికయ్యారు. అయితే వీరిలో బుమ్రా ని కేవలం 3 టెస్ట్ మ్యాచ్ లకు మాత్రమే ఆడిస్తానని కోచ్ గంభీర్, కెప్టెన్ శుబ్ మన్ గిల్ ఇటీవల చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో బుమ్రా అద్భతంగా బౌలింగ్ చేస్తే.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. 

?igsh=YWhua2N6YmxqbzRp

Related News

Liam Livingstone: 4,6,6,6,4 తో ఊచకోత… రషీద్ ఖాన్ ఇజ్జత్ తీసిన లివింగ్ స్టన్

Women’s ODI World Cup : మహిళల ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా డామినేట్.. ఈ లెక్కలు చూస్తే వణుకు పుట్టాల్సిందే

Kashish Kapoor : ఒక నైట్ కు వస్తావా? అని అడిగాడు… టీమిండియా క్రికెటర్ పై హాట్ బ్యూటీ సంచలన ఆరోపణలు!

Women’s World Cup 2025 : చిన్నస్వామిలో మ్యాచ్ లు బ్యాన్.. తిరువనంతపురంకు షిఫ్ట్.. షాక్ లో RCB!

Kohli Beard : కోహ్లీకి తెల్ల గడ్డం… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న అనుష్క శర్మ !

Salman Khan IPL Team RCB : జట్టును కొనబోతున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్?

Big Stories

×