Nida Dar On IND vs PAK: టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (Team India vs. Pakistan) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొంటున్నాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా.. ద్వైపాక్షిక సిరీస్ లకు చెక్ పెట్టింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నమెంటులో మాత్రమే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు చూస్తున్నారు. టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో.. మొన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.
Also Read: Mike Hesson On IND vs PAKMike Hesson on Pakistan not winning the ICC events: టీమిండియాను ఓడించే మొనగాడు లేడు, అందుకే పాకిస్తాన్ మూడు చెరువుల నీళ్లు తాగుతోంది
ఇందులో టీమిండియా బంపర్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ మాజీలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. లేటెస్ట్ గా ఇదే అంశంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ నిదా దార్ (Nida Dar On IND vs PAK) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో తాను కెప్టెన్ గా ఉన్నప్పుడు టీమిండియా.. భయపడిపోయదని వ్యాఖ్యానించారు. తనను తలుచుకొని టీమిండియా ప్లేయర్లు… దడుచుకునే వారని టీమిండియా ప్లేయర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు టీమిండియా మహిళల చేతిలో తమ పాకిస్తాన్ జట్టు చిత్తుగా ఓడిపోతుందని చురకలు అంటించారు. దీంతో నిదా దార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇటీవల గ్రూప్ దశలో టీమిండియా చేతిలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ నిదా దార్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతమున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు పెద్దగా ప్రదర్శన చేయడం లేదని మండిపడ్డారు. ఫాతిమా సనా మినహా ఏ ఒక్కరు సరిగ్గా ఆడక… టీమిండియా లాంటి శత్రు దేశాల చేతిలో ఓడిపోతున్నారని ఆగ్రహించారు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా ప్లేయర్లకు నరకం చూపించానని స్పష్టం చేశారు.
తనను తలుచుకొని టీమిండియా ప్లేయర్లే భయపడిపోయారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాగా లేదని సెటైర్లు పేల్చారు. తాను ఆడినప్పుడు ఉన్న పాకిస్తాన్ జట్టు వేరని.. ఇప్పుడు ఉన్న మహిళల జట్టు మరోలాగా ఉందని వ్యాఖ్యానించారు. పసికూనల చేతిలో కూడా ఇప్పటి పాకిస్తాన్ మహిళల జట్టు ఓడిపోతుందని ఆగ్రహించారు. అలాంటిది టీమిండియా పైన గెలవడం అసాధ్యం అన్నారు. కానీ తన కెప్టెన్సీలో మాత్రం టీమిండియా కు చుక్కలు చూపించినట్లు గుర్తు చేశారు. నన్ను చూస్తేనే టీమిండియా భయపడిపోయేది..రాత్రుళ్లు ఉలిక్కిపడేవారన్నారు. దీంతో నిదా దార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.