Shahid Afridi On IND VS PAK: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు అన్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజున ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ నిర్వహిస్తే ఆరోజు అందరూ టీవీలకే అతుక్కుపోతారు. అంతలా పాపులర్ అయింది ఈ దాయాదుల పోరు. అయితే అప్పట్లో టీమ్ ఇండియా పై ప్రతిసారి పాకిస్తాన్ విజయం సాధిస్తూ, ఇరగదీసేది. కానీ మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతి మ్యాచ్ లోనూ పాకిస్తాన్ జట్టును చిత్తు చేస్తూ టీమ్ ఇండియా పై చేయి సాధిస్తోంది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ప్రతిసారి ఐసీసీ టోర్నమెంట్లలో భాగంగానే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ నిర్వహిస్తున్నారు. వీటిల్లో ప్రతిసారి టీమిండియా గెలుస్తూ దుమ్ము లేపుతోంది.
ఐసీసీ టోర్నమెంట్లలో పాకిస్తాన్ జట్టును చిత్తు చేస్తున్న టీమ్ ఇండియాను ఉద్దేశించి మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ చైర్మన్ గా జై షా ఉన్నన్ని రోజులు టీమిండియాను ఓడించడం కష్టమేనన్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే.. వేదిక ఎక్కడైనా సరే ఫ్లాట్ మైదానాలను ఐసీసీ సిద్ధం చేస్తుందని ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా ప్రతిసారి గెలుస్తూ వస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ చైర్మన్ గా జై షా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమిండియా అత్యంత బలంగా తయారైందని కూడా పేర్కొన్నారు షాహిద్ అఫ్రిది. జై షా కుట్ర చేసి మరి టీమిండియా కు అనుకూలంగా ఉండే మైదానాలను తయారు చేసి బదులుతున్నాడని ఫైర్ అయ్యారు షాహిద్ అఫ్రిది.
గతంలో దుబాయి, శ్రీలంకలో పిచ్ లు మార్చేసి, పాకిస్తాన్ ను ఓడించారని ఆరోపణలు చేశారు షాహిద్ అఫ్రిది. అందుకే ప్రతిసారి పాకిస్తాన్ పైన ఈ మధ్యకాలంలో టీమిండియా ఈజీగా విక్టరీ సాధిస్తుందని ఫైర్ అయ్యారు. అలాగే గత మూడు సంవత్సరాల కాలంలోనే మూడు ఐసీసీ ట్రోఫీలు టీమిండియా దక్కించుకుందని తెలిపారు. ఈ కుట్ర వెనుక కూడా ఐసీసీ బాస్ జై షా ఉన్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన రాజీనామా చేస్తేనే టీమ్ ఇండియా పై పాకిస్తాన్ అవలీలగా గెలుస్తుందని పేర్కొన్నారు. మహిళల టీమిండియా కూడా ఇలాగే తమ మహిళలను ఓడిస్తూ వస్తోందని గుర్తు చేశారు. ఈ పరిస్థితి పూర్తిగా మారాలని.. లేకపోతే పాకిస్తాన్ జన్మలో కూడా టీమిండియా పై గెలవదని కుండబద్దలు కొట్టి చెప్పారు షాహిద్ అఫ్రిది.