E-Paper
Advertisement

IPL 2025: RCB కప్పు కొట్టాలని తెలుగోడి శబరిమల యాత్ర…?

IPL 2025: RCB కప్పు కొట్టాలని తెలుగోడి శబరిమల యాత్ర…?
Advertisement

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటే కేవలం టోర్నీ మాత్రమే కాదు. ఇది భారతదేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఓ క్రికెట్ పండుగ. ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్స్ ఆటను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్ లో 17 సీజన్లు జరగగా.. టైటిల్ గెలవలేకపోయిన టీమ్ లలో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సిబి) టీమ్ కూడా ఒకటి.

Also Read: Champions Trophy Ticket Prices: పాక్ లో జరిగే మ్యాచ్ టిక్కెట్లు విడుదల.. క్వార్టర్ బాటిల్ కంటే చీప్ ధరలు!

Advertisement

అలాగని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం మొత్తానికి ఫెయిల్యూర్ జట్టు కూడా కాదు. ఈ టీమ్ మూడుసార్లు ఫైనల్ చేరింది. అలాగే మరో ఆరుసార్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. గత ఐదు సీజన్లలో ఆర్సిబి 4 సార్లు ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. ఇక 2023 ఐపీఎల్ సీజన్ లో ఆరో స్థానంలో నిలిచి తృటిలో ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఆర్సిబి జట్టుకు 9 సీజన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. 2021 ఐపిఎల్ సీజన్ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.

2022 ఐపీఎల్ సీజన్ నుండి ఫాఫ్ డూప్లెససిస్ ఈ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ ఐపీఎల్ లో మిగతా ఫ్రాంచైజీలన్నీ ఓఎత్తైతే.. ఆర్సీబీ మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే ఈ జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈ టీమ్ లోని ఆల్ రౌండర్లు, అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఏ క్షణంలోనైనా మ్యాచ్ ని మలుపు తిప్పే హిట్టర్లు ఉండేవారు. కానీ వారు ఇంతవరకు ఐపీఎల్ లో కప్ కొట్టలేదు. కానీ ప్రతి సీజన్ లో ఆర్సిబి అభిమానులు మాత్రం “ఈ సాలా కప్ నమ్దే”.. అంటే ఈ సంవత్సరం కప్పు మాదే అంటూ హంగామా చేస్తారు.

Advertisement

కానీ దానికి అనుగుణంగా మాత్రం ఆర్సిబి ప్లేయర్స్ ఆట మాత్రం ఉండదు. ఇక 2025 సీజన్ కి సంబంధించి ఆర్సిబి ఎక్కువగా సీనియర్ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించకుండా.. యువ ఆటగాళ్ల వైపు మొగ్గు చూపింది. భువనేశ్వర్ కుమార్, లుంగీ ఎంగిడి, జోష్ హేజిల్ వుడ్ వంటి కీలక ప్లేయర్లను ఆర్ సి బి ఈ సీజన్ లో దక్కించుకుంది. ముగ్గురు ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న ఆర్సిబి.. 2025 మెగా వేలంలోకి 83 కోట్లతో అడుగుపెట్టింది. ఇందులో యువ ఆటగాళ్లకి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది.

Also Read: Jasprit Bumrah: టీమిండియాకు రిలీఫ్… తన గాయంపై బుమ్రా కీలక ప్రకటన

అయితే ఈ యంగ్ ప్లేయర్స్ తో ఈసారి ఆర్సిబి కప్ కొట్టడం ఖాయమని అభిమానులు అంటున్న మాట. ఈ కప్ కోసం 17 సంవత్సరాలుగా ఆర్సీబీ అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి ఆర్సిబి ఎలాగైనా కొట్టాలని ఓ తెలుగు వ్యక్తి.. అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్ర చేస్తున్నాడు. పాదయాత్రగా శబరిమల వెళుతూ దారి వెంట ఉన్న అన్ని దేవుళ్లకు మొక్కుతూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2025 ఐపీఎల్ లో ఆర్సిబి ఛాంపియన్ అవ్వాలని శబరిమల యాత్ర చేస్తున్నానని చెబుతున్న పటాస్ ప్రశీత్ అనే ఈ ఆర్సిబి డై హార్డ్ ఫ్యాన్ వీడియోని మీరు కూడా ఓసారి చూసేయండి.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Kongarla prasheeth kumar (@pataas_prasheeth)

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×