E-Paper
Advertisement

Bhupalpalli: ఘోర విషాదం.. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు

Bhupalpalli: ఘోర విషాదం.. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు

Father and son have heart attacks in Bhupalpalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. మొదట తండ్రికి గుండెపోటు రావడంతో తట్టుకోలేని కొడుకు రోదనలకు అదే రోజు గుండెపోటు వచ్చింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని పెద్దంపేట గ్రామంలో జరిగింది.

వివరాల ప్రకారం.. పెద్దంపేట గ్రామానికి చెందిన బీసులు పెద్ద లస్మయ్య(62)కు సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. దీంతో కొడుకు కృష్ణం రాజు రోదనలు కంటతడి పెట్టించాయి. తనకు ఎంతో ఇష్టమైన తన తండ్రి ఇకలేరని వార్తను జీర్ణించుకోలేకపోయాడు. తనను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే గుండెపోటుతో కృష్ణం రాజు మృతి చెందాడు. ఈ హృదయవిచారక ఘటనను చూసిన గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు.

Alao Read: ఏసీబీకి చిక్కిన జాయింట్ కలెక్టర్, ధరణి.. ఆపై 8 లక్షలు..

లస్మయ్య చనిపోవడంతో కొడుకు కృష్ణం రాజు తల్లడిల్లిపోయాడు. ఉదయం నుంచి రోదిస్తూనే అంత్యక్రియలు చేసిన కృష్ణంరాజు సాయంత్రం గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇలా ఒకేరోజు తండ్రీకొడుకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Big Stories

×