E-Paper
Advertisement

Bhupalpalli: ఘోర విషాదం.. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు

Bhupalpalli: ఘోర విషాదం.. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు
Advertisement

Father and son have heart attacks in Bhupalpalli: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒకేరోజు తండ్రీకొడుకులకు గుండెపోటు రావడంతో మృతి చెందారు. మొదట తండ్రికి గుండెపోటు రావడంతో తట్టుకోలేని కొడుకు రోదనలకు అదే రోజు గుండెపోటు వచ్చింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని పెద్దంపేట గ్రామంలో జరిగింది.

వివరాల ప్రకారం.. పెద్దంపేట గ్రామానికి చెందిన బీసులు పెద్ద లస్మయ్య(62)కు సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. దీంతో కొడుకు కృష్ణం రాజు రోదనలు కంటతడి పెట్టించాయి. తనకు ఎంతో ఇష్టమైన తన తండ్రి ఇకలేరని వార్తను జీర్ణించుకోలేకపోయాడు. తనను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే గుండెపోటుతో కృష్ణం రాజు మృతి చెందాడు. ఈ హృదయవిచారక ఘటనను చూసిన గ్రామస్తులు సైతం కంటతడిపెట్టారు.

Advertisement

Alao Read: ఏసీబీకి చిక్కిన జాయింట్ కలెక్టర్, ధరణి.. ఆపై 8 లక్షలు..

లస్మయ్య చనిపోవడంతో కొడుకు కృష్ణం రాజు తల్లడిల్లిపోయాడు. ఉదయం నుంచి రోదిస్తూనే అంత్యక్రియలు చేసిన కృష్ణంరాజు సాయంత్రం గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇలా ఒకేరోజు తండ్రీకొడుకులు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×