Cyber Crime: సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ పోలీసుల మెరుపు దాడులు చేశారు. జూలై నెలలో మోత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేసి 49 మంది సైబర్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. NCRP ఫిర్యాదుల ఆధారంగా 70 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటిలో దాదాపుగా 25 ప్రధాన సైబర్ కేసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేదించారు. బాధితులకు రూ.98.89 లక్షలను రికవరీ చేసి రిఫండ్ చేశారు. ట్రేడింగ్ ఫ్రాడ్ కేసుల్లో అత్యధికంగా 29 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ దాడుల్లో తెలంగాణ నుంచి 13 మంది సైబర్ నిందితులు పట్టివేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్ సహా 15 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. నిందితుల వద్ద 25 డెబిట్ కార్డులు, 23 మొబైళ్లను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు. 3 ల్యాప్టాప్లు, చెక్బుక్కులు, పాస్బుక్కులు, పాస్పోర్ట్ సీజ్ చేశారు. జూలైలో ట్రేడింగ్ ఫ్రాడ్ వల్ల 11.75 కోట్లకు పైగా నష్టం వచ్చిందని. 38 కేసుల్లో బాధితులకు రూ.98.89 లక్షలు తిరిగి అందజేశారు. జోనల్ సైబర్ సెల్స్లో 298 కేసులు నమోదు చేసి 6 మందిని అరెస్ట్ చేశారు.
Also Read: విజయవాడలో బోండా ఉమ హల్చల్.. మల్లాది విష్ణు దీక్ష వద్ద ఊహించని సీన్!
సైబర్ పెట్రోలింగ్లో 128 ఫేక్ ప్రొఫైళ్లు, 36 ప్రకటనలు బ్లాక్ చేసారు. ఇప్పటివరకు దాదాపుగా 1,086 ఫేక్ ప్రొఫైళ్లు, 2,553 ప్రకటనలను పోలీసులు తొలగించారు. ‘సి-మిత్ర’ ద్వారా 1,537 మంది బాధితులకు సహాయం అందించారు. 231 జీరో ఎఫ్ఐఆర్లు హైదరాబాద్ పోలీసులలు నమోదు చేశారు. వాట్సాప్ హ్యాక్ చేసి 25 లక్షలు కాజేసిన కేసులో కీలక నిందితుడి అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే మోసాలను నమ్మొద్దని పోలీసుల హెచ్చరికలు జానీ చేశారు.
Also Read: హైడ్రా ఎంట్రీతో షాక్లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!