E-Paper
Advertisement

సైబర్ నేరగాళ్లకు చుక్కలు చూపించిన హైదరాబాద్ సిటీ పోలీసులు!

సైబర్ నేరగాళ్లకు చుక్కలు చూపించిన హైదరాబాద్ సిటీ పోలీసులు!
Advertisement

Cyber Crime: సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ పోలీసుల మెరుపు దాడులు చేశారు. జూలై నెలలో మోత్తం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్లు చేసి 49 మంది సైబర్ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. NCRP ఫిర్యాదుల ఆధారంగా 70 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిలో దాదాపుగా 25 ప్రధాన సైబర్ కేసులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చేదించారు. బాధితులకు రూ.98.89 లక్షలను రికవరీ చేసి రిఫండ్ చేశారు. ట్రేడింగ్ ఫ్రాడ్ కేసుల్లో అత్యధికంగా 29 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

15 రాష్ట్రాల్లో సోదాలు..

ఈ దాడుల్లో తెలంగాణ నుంచి 13 మంది సైబర్ నిందితులు పట్టివేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్, బెంగాల్ సహా 15 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. నిందితుల వద్ద 25 డెబిట్ కార్డులు, 23 మొబైళ్లను పోలీసలు స్వాధీనం చేసుకున్నారు. 3 ల్యాప్‌టాప్‌లు, చెక్‌బుక్కులు, పాస్‌బుక్కులు, పాస్‌పోర్ట్ సీజ్ చేశారు. జూలైలో ట్రేడింగ్ ఫ్రాడ్ వల్ల 11.75 కోట్లకు పైగా నష్టం వచ్చిందని. 38 కేసుల్లో బాధితులకు రూ.98.89 లక్షలు తిరిగి అందజేశారు. జోనల్ సైబర్ సెల్స్‌లో 298 కేసులు నమోదు చేసి 6 మందిని అరెస్ట్ చేశారు.

Advertisement

Also Read: విజయవాడలో బోండా ఉమ హల్‌చల్.. మల్లాది విష్ణు దీక్ష వద్ద ఊహించని సీన్!

231 జీరో ఎఫ్‌ఐఆర్‌లు..

సైబర్ పెట్రోలింగ్‌లో 128 ఫేక్ ప్రొఫైళ్లు, 36 ప్రకటనలు బ్లాక్ చేసారు. ఇప్పటివరకు దాదాపుగా 1,086 ఫేక్ ప్రొఫైళ్లు, 2,553 ప్రకటనలను పోలీసులు తొలగించారు. ‘సి-మిత్ర’ ద్వారా 1,537 మంది బాధితులకు సహాయం అందించారు. 231 జీరో ఎఫ్‌ఐఆర్‌లు హైదరాబాద్ పోలీసులలు నమోదు చేశారు. వాట్సాప్ హ్యాక్ చేసి 25 లక్షలు కాజేసిన కేసులో కీలక నిందితుడి అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వచ్చే మోసాలను నమ్మొద్దని పోలీసుల హెచ్చరికలు జానీ చేశారు.

Advertisement

Also Read: హైడ్రా ఎంట్రీతో షాక్‌లో కాలేజీల యాజమాన్యాలు.. వెలుగులోకి బిగ్ స్కామ్స్!

Tags

Related News

ఒంటరి మహిళ భూమిపై బీఆర్ఎస్ నాయకుడి కన్ను.. రాత్రికి రాత్రే గోడ నిర్మాణం!

ఆర్థికవేత్త అరవింద్ సుబ్రమణియన్‌తో సీఎం రేవంత్ భేటీ.. కీలకంగా చర్చించిన అంశాలివే!

రూ.51 లక్షలకు లడ్డు కొని.. రూ.4 కోట్లతో జంప్.. మై హోమ్ భుజాలో క్లాసిక్ మోసం!

పొత్తులు లేవు.. ఒంటరిగానే బరిలోకి.. జనసేనకు తెలంగాణ బీజేపీ షాక్!

విజయవాడ ప్రజలకు గుడ్ న్యూస్.. గన్నవరం మెట్రో లైన్‌పై కీలక ముందడుగు!

వర్షాలకోసం నాగార్జున సాగ‌ర్‌లో సీఎం రేవంత్ వరుణ యాగం!

తెలంగాణ ప్రజలకు హై అలర్ట్.. రేపు ఆటోలు, క్యాబ్‌లు, స్విగ్గీ, జొమాటో సేవలు బంద్!

Big Stories

Advertisement
×