E-Paper
Advertisement

గచ్చిబౌలి IIITలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య

గచ్చిబౌలి IIITలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య
Advertisement

IIIT Student: ఐటీ హబ్ గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ (IIIT) క్యాంపస్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఓ విద్యార్థి కళాశాల భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. తోటి విద్యార్థులు కళ్లముందే ఈ ఘోరం జరగడంతో క్యాంపస్‌లో ఒక్కసారిగా భయాందోళనలు, విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిగా గుర్తించారు.

6వ అంతస్తు నుంచి దూకి..

Advertisement

పోలీసులు వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్ గచ్చిబౌలి IIITలో చదువుతున్నాడు. శనివారం ఆయన క్యాంపస్‌లోని బిల్డింగ్ 6వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. తీవ్ర గాయాలైన అభిరూప్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఆత్మహత్యకు గల కారణాలు

Advertisement

అభిరూప్ ఈ విపరీత నిర్ణయం తీసుకోవడానికి గల పూర్తి కారణాలు ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. అయితే, గత కొంతకాలంగా అతను తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ మానసిక ఒత్తిడి భరించలేకనే బిల్డింగ్ పైనుంచి దూకి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

కేసు నమోదు చేసి దర్యాప్తు

ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. విద్యార్థి ఫోన్ కాల్ డేటాతో పాటు, క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. అభిరూప్ మరణవార్తను ఖమ్మంలోని ఆయన కుటుంబ సభ్యులకు చేరవేశారు. ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు ఇలా విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×