E-Paper
Advertisement

కేటీఆర్ ఖాళీగా ఉన్నారు.. అందుకే చర్చలకు పిలుస్తున్నారు: జగ్గారెడ్డి

కేటీఆర్ ఖాళీగా ఉన్నారు.. అందుకే చర్చలకు పిలుస్తున్నారు: జగ్గారెడ్డి
Advertisement

Jagga Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య సాగుతున్న సవాల్-ప్రతిసవాళ్లపై మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కేటీఆర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు కాబట్టే చర్చలంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి చాలా బిజీ!

Advertisement

గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడమే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిపోతోందని జగ్గారెడ్డి అన్నారు. ఒకపక్క అప్పుల భారం, మరోపక్క రైతులకు ఇచ్చిన హామీల అమలుతో సీఎం రేవంత్ రెడ్డి రాత్రింబవళ్లు ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే పనిలో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు.

Also Read: వాట్సాప్ ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌పై కేంద్రం నజర్.. ‘మెటా’కు నోటీసులు?

Advertisement

మిగులు బడ్జెట్ ఇస్తే చర్చించేవాళ్లం..

బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను మిగులు బడ్జెట్ రాష్ట్రంగా కాకుండా, అప్పుల తెలంగాణగా మార్చిందని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఒకవేళ గత ప్రభుత్వం కాంగ్రెస్‌కు మిగులు బడ్జెట్ అప్పగించి ఉంటే, కేటీఆర్ కోరినట్టుగా చర్చలు జరపడానికి తమకు వీలుండేదని స్పష్టం చేశారు. కానీ ఖజానా ఖాళీ చేసి, ఇప్పుడు చర్చలంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు.

అధికారం పోయాకే కేటీఆర్‌కు రైతులు గుర్తొచ్చారు..

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కష్టాలు పట్టించుకోని కేటీఆర్, ఇప్పుడు అధికారం పోయాక రైతుల గురించి మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీతో పాటు మిగిలిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని, కేటీఆర్ ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజలు నమ్మరని ఆయన స్పష్టం చేశారు.

Related News

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

22ఏ భూ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కలెక్టర్‌ మను చౌదరి కీలక ఆదేశాలు జారీ!

22ఏ భూముల వివాదానికి చెక్.. సబ్‌రిజిస్ట్రార్లకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు!

ప్రిన్సిపాల్ రూపారెడ్డిని ఆ విద్యార్థులు అందుకే చంపారు.. యూట్యూబ్‌లో చూసి మరీ..

నర్సంపేట్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్!

డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్!

Big Stories

Advertisement
×