Jagtial Gangrape: జగిత్యాల జిల్లాలో గ్యాంగ్ రేప్ సంఘటన కలకలం రేపింది. ఈ సంఘగటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నూకపల్లి డబుల్ బెడ్రూమ్లలో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను మొబైల్లో వీడియో రికార్డు చేసినట్లుకూడా ఆరోపణలు వస్తున్నాయి.
నిజామాబాద్కు చెందిన ఓ మహిళను రెండు రోజుల క్రితం జగిత్యాలకు ఓ యువకుడు పిలిపించాడు. దీంతో మల్యాల రాజారాం గ్రామానికి చెందిన యువకుడు మహిళను నూకపల్లి డబుల్ బెడ్రూమ్కు తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం తన ముగ్గురు స్నేహితులను కూడా కలవాలని మహిళపై యువకుడు మహిళపై ఒత్తిడి చేసి హత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో భాదిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.
Also Read: మగవాళ్లకు బిగ్ రిలీఫ్ .. గ్రేటర్ పరిధిలో కొత్తగా 75 సిటీ బస్సులు
దీంతో రంగంలోకి దిగిన మల్యాల పోలీసులు నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన ముగ్గురు యువకులు రాజారాం గ్రామానికి చెందిన వారిగా మరో యువకుడు ధరూర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాల కోసం పోలీసుల విచారణ చేపట్టారు.
Also Read: 8 ఏళ్ల బాబు చెప్పిన కథలు విని పోలీసులే షాక్… చివర్లో వచ్చే ట్విస్ట్ కి దిమాక్ కరాబ్