BigTV English

Jagtial Shocking Incidents: బ్రతికుండగానే ఆ నలుగురు.. తల్లిని మోశారు.. జగిత్యాలలో దారుణం

Jagtial Shocking Incidents: బ్రతికుండగానే ఆ నలుగురు.. తల్లిని మోశారు.. జగిత్యాలలో దారుణం
Advertisement

Jagtial Shocking Incident: సాధారణంగా మన కంటి ఎదురుగా ఎవరైనా అచేతన స్థితిలో ఉంటే, మన కళ్లు చెమ్మగిల్లుతాయి. చేతనైతే ఇంత సాయం అందిస్తాం. కానీ అదే మన తల్లిదండ్రులకు ఆ కష్టం వస్తే.. తల్లడిల్లిపోతాం. ఇటీవల కొందరు కుమారులు మాత్రం తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే, నరకం అంటే ఇదీ అన్నట్లుగా భూలోకంలోనే వారికి యమలోకం చూపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తల్లి బ్రతికి ఉండగా ఆ నలుగురు కొడుకులు.. ఆ నలుగురిగా మోస్తూ.. తల్లిని స్మశానంలో వదిలేశారు. ఇంత దారుణానికి పాల్పడడానికి గల కారణం ఏమిటో తెలిస్తే ఔరా అనేస్తారు.


జగిత్యాలలో మోతె స్మశాన వాటిక ఉంది. అక్కడికి ఆ నలుగురు మోసుకుంటూ ఒకరిని అక్కడికి తీసుకువచ్చారు. ఎవరో చనిపోయారు అందుకేనేమో.. తీసుకువచ్చారని అనుకున్నారు అందరూ. అక్కడే ట్విస్ట్ తెలిసి ఖంగుతిన్నారు. జగిత్యాలకు చెందిన రాజవ్వకు నలుగురు కుమారులు. అయితే గత కొద్దిరోజులుగా వారి ఆప్యాయతకు తల్లి రాజవ్వ దూరమైంది. అది కూడా ఆ నలుగురు కుమారులలో ఒక కుమారుడు ఇటీవల పింఛన్ నగదు కోసం స్వయాన తల్లినే చితకబాదాడు.

చెప్పేందుకు నలుగురు కుమారులు ఉన్నా.. బువ్వ పెట్టే దిక్కులేని పరిస్థితి రాజవ్వది. ఎలాగైనా రాజవ్వను వదిలించుకోవాలనుకున్న వారు, బ్రతికి ఉండగానే నేరుగా స్మశానవాటికకు తరలించారు. ఇప్పటికే 8 రోజులుగా అన్నం పెట్టే దిక్కులేక, ఆశ్రయించే వారు లేక అక్కడే రాజవ్వ కాలం వెళ్లదీస్తోంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న సంక్షేమ శాఖ అధికారులు.. రాజవ్వను సంప్రదించారు.


Also Read: Batti Comments : కలెక్టర్‌ని అంత మాట అంటావా?.. నీకు మర్యాద తెలుసా..? భట్టి విక్రమార్క సీరియస్

రాజవ్వ ఉన్నది ఉన్నట్లుగా వివరించి, తనను ఆదుకోవాలని వారిని ప్రాధేయపడింది. వెంటనే రాజవ్వను వైద్యశాలకు తరలించి వారు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై సంక్షేమ శాఖ అధికారి నరేష్ మాట్లాడుతూ.. రాజవ్వ కుమారులపై వయోవృద్ధులు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏదిఏమైనా బాల్యంలో తన పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తుంటే చిరునవ్వులు చిందించిన ఆ తల్లి, ఈరోజు అవే అడుగులతో బ్రతికుండగానే స్మశానానికి తీసుకువస్తారని ఊహించలేక పోయింది.

Related News

Diwali Eye effected: దీపావళి టపాసుల ఎఫెక్ట్.. కంటి సమస్యలతో సరోజినీ దేవి ఆసుపత్రికి బాధితులు క్యూ

DGP Shivadhar Reddy: కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటాం: డీజీపీ శివధర్ రెడ్డి

Megha Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న‌ మంత్రి ఉత్తమ్ కుమార్!

Kcr Jagan: కేసీఆర్ – జగన్.. వారిద్దరికీ అదో తుత్తి

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ బై పోల్.. బీఆర్ఎస్ 40 మంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్లే

Jubilee hills By Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. 150కి పైగా నామినేషన్లు.. ముగిసిన గడువు

దొడ్డి కొమరయ్య: తెలంగాణ ఆయుధ పోరాటపు తొలి అమర వీరుడు

Sangareddy News: పేకాడుతూ చిక్కిన బీఆర్ఎస్ నేతలు.. రంగంలోకి కీలక నాయకులు

Big Stories

×