E-Paper
Advertisement

Jagtial Shocking Incidents: బ్రతికుండగానే ఆ నలుగురు.. తల్లిని మోశారు.. జగిత్యాలలో దారుణం

Jagtial Shocking Incidents: బ్రతికుండగానే ఆ నలుగురు.. తల్లిని మోశారు.. జగిత్యాలలో దారుణం
Advertisement

Jagtial Shocking Incident: సాధారణంగా మన కంటి ఎదురుగా ఎవరైనా అచేతన స్థితిలో ఉంటే, మన కళ్లు చెమ్మగిల్లుతాయి. చేతనైతే ఇంత సాయం అందిస్తాం. కానీ అదే మన తల్లిదండ్రులకు ఆ కష్టం వస్తే.. తల్లడిల్లిపోతాం. ఇటీవల కొందరు కుమారులు మాత్రం తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే, నరకం అంటే ఇదీ అన్నట్లుగా భూలోకంలోనే వారికి యమలోకం చూపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తల్లి బ్రతికి ఉండగా ఆ నలుగురు కొడుకులు.. ఆ నలుగురిగా మోస్తూ.. తల్లిని స్మశానంలో వదిలేశారు. ఇంత దారుణానికి పాల్పడడానికి గల కారణం ఏమిటో తెలిస్తే ఔరా అనేస్తారు.

జగిత్యాలలో మోతె స్మశాన వాటిక ఉంది. అక్కడికి ఆ నలుగురు మోసుకుంటూ ఒకరిని అక్కడికి తీసుకువచ్చారు. ఎవరో చనిపోయారు అందుకేనేమో.. తీసుకువచ్చారని అనుకున్నారు అందరూ. అక్కడే ట్విస్ట్ తెలిసి ఖంగుతిన్నారు. జగిత్యాలకు చెందిన రాజవ్వకు నలుగురు కుమారులు. అయితే గత కొద్దిరోజులుగా వారి ఆప్యాయతకు తల్లి రాజవ్వ దూరమైంది. అది కూడా ఆ నలుగురు కుమారులలో ఒక కుమారుడు ఇటీవల పింఛన్ నగదు కోసం స్వయాన తల్లినే చితకబాదాడు.

Advertisement

చెప్పేందుకు నలుగురు కుమారులు ఉన్నా.. బువ్వ పెట్టే దిక్కులేని పరిస్థితి రాజవ్వది. ఎలాగైనా రాజవ్వను వదిలించుకోవాలనుకున్న వారు, బ్రతికి ఉండగానే నేరుగా స్మశానవాటికకు తరలించారు. ఇప్పటికే 8 రోజులుగా అన్నం పెట్టే దిక్కులేక, ఆశ్రయించే వారు లేక అక్కడే రాజవ్వ కాలం వెళ్లదీస్తోంది. ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న సంక్షేమ శాఖ అధికారులు.. రాజవ్వను సంప్రదించారు.

Also Read: Batti Comments : కలెక్టర్‌ని అంత మాట అంటావా?.. నీకు మర్యాద తెలుసా..? భట్టి విక్రమార్క సీరియస్

Advertisement

రాజవ్వ ఉన్నది ఉన్నట్లుగా వివరించి, తనను ఆదుకోవాలని వారిని ప్రాధేయపడింది. వెంటనే రాజవ్వను వైద్యశాలకు తరలించి వారు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై సంక్షేమ శాఖ అధికారి నరేష్ మాట్లాడుతూ.. రాజవ్వ కుమారులపై వయోవృద్ధులు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏదిఏమైనా బాల్యంలో తన పిల్లలు బుడిబుడి అడుగులు వేస్తుంటే చిరునవ్వులు చిందించిన ఆ తల్లి, ఈరోజు అవే అడుగులతో బ్రతికుండగానే స్మశానానికి తీసుకువస్తారని ఊహించలేక పోయింది.

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×