E-Paper
Advertisement

కాంగ్రెస్‌ను కనుమరుగు చేయడానికి రేవంత్ కుట్ర.. జీవన్ రెడ్డి సంచలనం

కాంగ్రెస్‌ను కనుమరుగు చేయడానికి రేవంత్ కుట్ర.. జీవన్ రెడ్డి సంచలనం
Advertisement

Jeevan Reddy: జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. 2023 ఎన్నికలకు ముందు 3500 మందికి డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలు మంజూరు చేశారన్నారు. నూకపల్లి డబుల్ బెడ్రూంలో సుమారు 4000 మంది ఇళ్లలో సర్ ప్రక్రియలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని తెలిపారు. నాలుగు వేల మందికి ఒక్క రేషన్ దుకాణం లేదని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్లలో నాలుగు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయా లేవా, సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు నివాసం ఉన్న చోట నమోదు చేయకపోవడం దారుణం అన్నారు.

జగిత్యాలలో కూడా..

ఇది బిఎల్ ఓల నిర్లక్ష్యమా.. కలెక్టర్ నిర్లక్యమా.. ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని ఫైర్ అయ్యారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో ఉండకపోవడానికి ఎవరు బాధ్యులు. 22ఏ హైదరాబాద్ కు మాత్రమే పరిమితం లేదు.. జగిత్యాలలో కూడా ఉన్నాయన్నారు. రెవెన్యూ మంత్రి జగిత్యాల పర్యటన నేపథ్యంలో 22 ఏ, భూ భారతి లో ఎన్ని దరఖాస్తులు ఎన్ని పెండింగ్ ఉన్నాయి. అన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలని తెలిపారు. వలసదారులతో సమస్య ఉత్పన్నం అవుతుంది. కొండా సుష్మితనూ రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డికి కేసు నోటీస్‌కి ఇవ్వాలని అన్నారు.

Advertisement

Also Read: బ్రెజిల్‌ లో E32 ఫ్యూయెల్ వాడుతున్నారు.. మరి భారత్‌లో E20పై ఎందుకింత భయం?

పవర్ ఆఫ్ అటార్నీ..

2034 వరకు రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి అంటే మల్లికార్జున ఖర్గే పవర్ ఆఫ్ అటార్నీ రేవంత్ రెడ్డికి రాసి ఇచ్చారా అని ఏద్దేవా వేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ విచ్చినానీకి ప్రధాన కారణమే రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి, కాంగ్రెస్ విచ్చిన్ననం చేస్తున్నదే రేవంత్ రెడ్డి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణ కమిటీ రేవంత్ రెడ్డి చెప్పు చేతుల్లో ఉన్నట్టు కనపడుతుంది. కాంగ్రెస్ ను కనుమరుగు చేయడం కోసమే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డికి రాసిచినం అంటే కాంగ్రెను మరిచిపోవాలి.. షో కాస్ నోటీస్ ఇవ్వాల్సి వస్తె ముందుగా రేవంత్ రెడ్డికి ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను తెర లేపిందే రేవంత్ రెడ్డి అని రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉండదు.. రేవంత్ రెడ్డి ఉండనియడని జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Also Read: వైఎస్ జగన్‌ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు.. న్యాయ పోరాటం చేస్తానని జగన్ హమీ!

Tags

Related News

జీవో 97 vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. రంగంలోకి కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!

ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం.. ఇబ్రహీంపట్నం తహసిల్దార్ ఇళ్లపై దాడులు!

నదీ జలాలపై ఏకపక్ష నిర్ణయాలొద్దు.. అన్ని రాష్ట్రాలకూ ఒకటే రూల్.. డిప్యూటీ సీఎం డిమాండ్

మేడ్చల్ టు పాకిస్తాన్.. హైదరాబాద్‌లో ISI నెట్‌వర్క్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి వివేక్ బంపర్ ఆఫర్..!

ఇది న్యాయం కాదు, నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు: కొండా సురేఖ

Big Stories

Advertisement
×