E-Paper
Advertisement

మేడ్చల్ టు పాకిస్తాన్.. హైదరాబాద్‌లో ISI నెట్‌వర్క్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

మేడ్చల్ టు పాకిస్తాన్.. హైదరాబాద్‌లో ISI నెట్‌వర్క్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
Advertisement

ISI Network: పాకిస్తాన్​ కు చెందిన ఐఎస్​ఐ గ్యాంగ్​ స్టర్​ షహజాద్ భట్టీ నెట్​ వర్క్​ కు చెందిన లింకులు హైదరాబాద్​ లో బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్​ చేసిన భద్రతా బలగాలు.. యూసుఫ్​ గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విచారణ చేపట్టి పలు కీలక ఆధారాలను సేకరించారు. హైదరాబాద్ లో ఇంకా ఎవరెవరికి ఈ నెట్ వర్క్​ తో సంబంధాలు ఉన్నాయన్న దిశగా దర్యాప్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

షహజాద్​ భట్టీ నెట్ వర్క్​ కు చెందిన ఇద్దరిని కొన్నిరోజుల క్రితం భద్రతా బలగాలు హైదరాబాద్ లోని యూసుఫ్​ గూడ, మేడ్చల్ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరికి ఘాజియాబాద్ కు చెందిన జాయిద్​ ఖాన్​ తో లింకులు ఉన్నట్టుగా విచారణలో వెల్లడైంది. జాయిద్​ ఖాన్​ ఫిబ్రవరిలో మేడ్చల్​ లోని ఓ రెస్టారెంట్​ లో ఉద్యోగం చేసినట్టుగా తెలిసింది. ఇన్​ స్టాగ్రాం రీల్స్ ద్వారా జాయిద్​ ఖాన్​ కు షహజాద్​ భట్టీ నెట్​ వర్క్​ తో పరిచయాలు ఏర్పడినట్టుగా సమాచారం.

Advertisement

Also Read: వైఎస్ జగన్‌ను కలిసిన మెడికో ప్రియాంక తల్లిదండ్రులు.. న్యాయ పోరాటం చేస్తానని జగన్ హమీ!

ఐఎస్​ఐ సానుభూతిపరులు రాణా హుస్సేన్​, హమీద్ లతో జాయిద్​ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో యూసుఫ్​ గూడ, మేడ్చల్​ ప్రాంతాల్లో తాజాగా తనిఖీలు జరిపి పలు ఆధారాలను సేకరించినట్టుగా తెలిసింది. కాగా, షహజాద్​ భట్టీ నెట్ వర్క్​ తో ఇంకా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న దిశగా ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో జాయిద్ తో దగ్గర పరిచయం ఉన్నవారిని గుర్తించి వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలను విశ్లేషిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Also Read: బ్రెజిల్‌ లో E32 ఫ్యూయెల్ వాడుతున్నారు.. మరి భారత్‌లో E20పై ఎందుకింత భయం?

Tags

Related News

ఏసీబీ వలలో మరో భారీ అవినీతి తిమింగలం.. ఇబ్రహీంపట్నం తహసిల్దార్ ఇళ్లపై దాడులు!

నదీ జలాలపై ఏకపక్ష నిర్ణయాలొద్దు.. అన్ని రాష్ట్రాలకూ ఒకటే రూల్.. డిప్యూటీ సీఎం డిమాండ్

కాంగ్రెస్‌ను కనుమరుగు చేయడానికి రేవంత్ కుట్ర.. జీవన్ రెడ్డి సంచలనం

అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి వివేక్ బంపర్ ఆఫర్..!

ఇది న్యాయం కాదు, నా కుమార్తె వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు: కొండా సురేఖ

కొల్తూరు చెరువులో 15 లక్షల చేపలు మృతి.. ఫార్మా వ్యర్థాలే కారణమని మత్స్యకారుల ఆందోళన!

Big Stories

Advertisement
×