E-Paper
Advertisement

కొల్తూరు చెరువులో 15 లక్షల చేపలు మృతి.. ఫార్మా వ్యర్థాలే కారణమని మత్స్యకారుల ఆందోళన!

కొల్తూరు చెరువులో 15 లక్షల చేపలు మృతి.. ఫార్మా వ్యర్థాలే కారణమని మత్స్యకారుల ఆందోళన!
Advertisement

Fish Deaths: స్వేచ్ఛ: మూడు చింతల పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు పెద్ద చెరువులో భారీగా చేప పిల్లలు మృతి చెందడం కలకలం రేపుతోంది. చెరువుకు సమీపంలోని ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు నీటిలో కలవడం వల్లే చేప పిల్లలు మృత్యువాత పడ్డాయని స్థానికులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.చెరువులో సుమారు 15 లక్షల చేప పిల్లలు మృతి చెందినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో చెరువుపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా ఇంత పెద్ద సంఖ్యలో చేప పిల్లలు మృతి చెందడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఫిర్యాదు..

Advertisement

గతంలోనే ఫిర్యాదుచెరువు నీటి కాలుష్యంపై గత ఏడాదే కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అప్పట్లోనే అధికారులు స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నమూనాలు సేకరించి పరీక్షించాలి

Advertisement

చేప పిల్లల మృతికి అసలు కారణమేంటో తేల్చేందుకు అధికారులు వెంటనే చెరువు నీరు, మృతిచెందిన చేపల నమూనాలను సేకరించి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. ఫార్మా పరిశ్రమల నుంచి రసాయన వ్యర్థాలు చెరువులోకి చేరాయా? లేదా ఇతర కారణాలతో చేపలు మృతి చెందాయా? అన్నది సమగ్రంగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.మత్స్యకారుల జీవనాధారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించాలని, చెరువు కాలుష్యానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు, గ్రామస్థులు కోరుతున్నారు.

Also Read: బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే మ్యాచ్.. అసెంబ్లీ తీరుపై వైఎస్ జగన్ సెటైర్లు!

Tags

Related News

పొంగులేటిని బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లెటర్!

సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత వ్యాఖ్యలు.. మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు!

రేవంతే మా రోల్ మోడల్.. ఢిల్లీ భేటీలో సిడబ్ల్యూసీ సంచలన నిర్ణయాలు!

సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబంలోని నలుగురి మృతి!

తెలంగాణ సివిల్ సప్లై‌లకు బిగ్ షాక్.. రైస్ మిల్లుల ఆడిట్‌లో దొరికిపోయిన మాజీ ఎమ్మెల్యే!

మెడికల్ ఆఫీసరే డ్యూటీకి రాకపోతే ఎలా.. యూపీహెచ్‌సీలో బయటపడ్డ నిర్లక్ష్యం!

మేడ్చల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా.. ‘శక్తి’ స్కీమ్‌ను రద్దు చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×