Krishna Water: కృష్ణా బేసిన్లోనూ రెండు రాష్ట్రాల అవసరాలకు సరిపడా నీళ్లు వస్తాయని, అయినా ఆంధ్రప్రదేశ్ అడ్డగోలుగా వాడేసుకుంటున్నదని, వరికి అవసరమయ్యే నీటికన్నా ఎక్కువగా వినియోగిస్తూ తిరిగి నీళ్లను అడుగుతుందని తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించింది. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ -2 (కేడబ్ల్యూడీటీ 2, బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ఎదుట శుక్రవారం తెలంగాణ అడ్వొకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ విదనలకు కౌంటర్లు, వివరణలు ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న నీటి కేటాయింపులు తాత్కాలికమేనని పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటివ్ అరెంజ్మెంట్ మాత్రమేనని, 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాలు పంచుకుంటున్న నీళ్ల వాటా శాశ్వతం కాదని వాదనలు వినిపించారు.
విభజనచట్టంలోని 84, 85(8), 87 సెక్షన్ల ప్రకారం నీటి వాటాల పంపకాలపై బోర్డులకు అధికారం లేదనిఅన్నారు. విభజనచట్టం, జల వివాదాల చట్టాన్ని ఏపీ తప్పుగా చెప్తున్నదని, ఆర్టికల్ 262 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ నీటిని కేటాయించాలని, జల కేటాయింపులను చేయడంలో పార్లమెంట్కుగానీ, కేంద్రానికిగానీ అధికారం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే కేడబ్ల్యూడీటీ 2కి ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను కేంద్రం సిఫార్సు చేసిందని, విభజనచట్టంలోని 85(8) సెక్షన్ తాత్కాలికం కాదని వాదనలు వినిపించారు. తదుపరి వాదనలు సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు కొనసాగనున్నాయి.
Also Read: ఎర్ర కండువా.. చేతిలో తుపాకీ.. శ్రీ విష్ణు మాస్ లుక్ అదిరిపోయిందే!
ఉమ్మడి ఏపీకి కేడబ్ల్యూడీటీ 2 కేటాయింపులను మళ్లీ సమీక్షించాల్సిన అవసరం లేదని ఏపీ వాదించడం తప్పు అన్నారు. రెండు రాష్ట్రాలకు ఆవిరి నష్టాలు, తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు పోనూ వ్యవసాయానికి 780 టీఎంసీల నీళ్లు ఉంటాయని, అందులో వరికి400 టీఎంసీలు వాడుకోవచ్చన్నారు. కృష్ణాలోని నీటిని తలసరి వినియోగం కింద లెక్కగట్టి చెప్తున్న ఏపీ.. కృష్ణాలో కలుస్తున్న గోదావరి నీళ్లు, పెన్నా నీళ్లను మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, అది శుద్ధ తప్పు వాదనలు వినిపించారు.
కేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకు నీటి వాటాలు తేల్చలేదంటూ ట్రిబ్యునల్ ఇంటరిమ్ ఆర్డర్ ఇచ్చిందని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఉమ్మడి ఏపీకి చేసిన కేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకు వాటాలను తేల్చాల్సిన అవసరం ఉంటుందని వైద్యనాథన్ అన్నారు. పూర్తి కేటాయింపులను ట్రిబ్యునల్ మార్చినప్పటికీ ఆకేటాయింపుల్లో రెండు రాష్ట్రాలకు వాటాలు ఇచ్చే అధికారం ఉంటుందని వాదనలు వినిపించారు.
Also Read: నీలగిరి కొండల్లో అరుదైన పువ్వులు.. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే, అందంగా ఉందని కోస్తే జైలుకే