Madhu Yaskhi: మధు యాష్కీ వచ్చాక ఎల్బీనగర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా స్పా సెంటర్లు వెలుస్తున్నాయిని, ఒకే వ్యక్తికి అనేక స్పా సెంటర్లు ఉన్నాయని స్పా సెంటర్ల నిర్వహణ వెనుక మధు యాష్కీ అనుచరుల హస్తం ఉందని, కాంగ్రెస్ సీనియర్ మహిళా నాయకురాలు కొత్త విద్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read: టాలీవుడ్కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ
స్పా సెంటర్లు ఏర్పాటు చేసి వ్యభిచారం నిర్వహిస్తూ అరెస్టయిన వ్యక్తికి ఇప్పుడు మధుయాష్కీ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడని తెలిపారు. అసలు ఎల్బీనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎటు పోతుందని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించాలని ఆమే కోరారు.
Also read; మాధురి రాథోడ్ నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ రాత్రి ఏం జరిగిందో చెప్పేసిన ఉప్పల్ బాలు!