Murder Plot: మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకురు గ్రామంలో ఒ సంఘనట కలకలం రేపుతుంది. నా భార్య నన్ను చంపడానికి ప్రయత్నిస్తుందనే వార్త ఇప్పడు కలకలం రేపుతుంది. వివరాల్లోకి ఇలా ఉన్నాయి. నా భర్తను యాక్సిడెంట్ చేసి చంపుతావా? లేదా? అంటూ అక్రమ సంభందం పెట్టుకున్న వ్యక్తితో నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారంటూ రాజేశ్వర్ రావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భర్తను చంపాలని ప్రియుడిపై నా భార్య ఒత్తిడి చేస్తుందని తెలిపాడు.
దీంతో తన భార్య భవాని, ఆమె ప్రియుడు సైదులుతో నాకు ప్రాణహాని ఉందని పోలీసులకు భర్త రాజేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. 2016లో రాజేశ్వరరావు, భవానీకి వివాహం చేసుకున్నాడు. దీంతో వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కొరియర్ బాయ్తో భార్య భవాని వివాహేతర సంబంధం పెట్టుకుందని, తనని చంపాలని ప్లాన్ చేసిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఇంట్లో లేనప్పుడు కొరియర్ బాయ్ సైదులు ఇంటికి రావడం, పోవడం జరుగుతున్నాయని రాజేశ్వర్ రావు ఫిర్యాదు చేశాడు.
Also Read: పురుషుల ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. గ్రేటర్ పరిధిలో 75 కొత్తగా సిటీ బస్సులు
దీంతో ప్రియుడితో రోడ్డు ప్రమాదం చేయించి తనను చంపాలని భార్య ప్లాన్ చేసినట్లు ఇన్స్టాగ్రామ్ చాటింగ్తో తెలిసిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు నా ఇద్దరు కుమార్తెలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాజేశ్వర్ రావు పోలీసుల్ని ఆశ్రయించాడు. అతని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసుల తెలిపారు. ఈ వార్తి స్థానికంగా ఇప్పడు సంచలనంగా మారింది.
కొరియర్ బాయ్తో అక్రమ సంబంధం.. భర్తను చంపేందుకు భార్య స్కెచ్
మహబూబాబాద్ జిల్లా చిలకోడులో కొరియర్ బాయ్ సైదులుతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భవాని, భర్త రాజేశ్వర్ రావును యాక్సిడెంట్లో చంపాలని ప్రియుడిని వాట్సాప్ మెసేజ్లో కోరింది. ఆ మెసేజ్లు చూసి షాక్ తిన్న భర్త, తన ప్రాణాలకు… pic.twitter.com/9oDYnXMB9a
— BIG TV Breaking News (@bigtvtelugu) August 7, 2026
Also Read: లోన్లు తీసుకునేవారికి తీపి కబురు.. వేధింపులు చెక్, ఆర్బీఐ కొత్త నిబంధనలు