Congress Row: నిజామాబాద్ జిల్లాలో పోచారం వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు హట్ టాపిక్గా మారింది. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ PAC సమావేశంలో గందరగోళం నెలకొంది. పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ బాన్సువాడ పాత కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు. దీనికోసం వందలాదిగా మంది తరలివచ్చి బైఠాయించారు.
Also Read: నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్.. భారీ డిస్కౌంట్లో హైయర్ స్మార్ట్ టీవీ
పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పోచారం తీరుతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరసనలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు పాత కాంగ్రెస్ నేతలు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి సిఎం దూషిస్తున్నగానీ అతనిపై ఎందుకు చర్యలు లేవు అంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: తెలంగాణలో లిక్కర్ లవర్స్కు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మధ్యం ధరలు