E-Paper
Advertisement

Ponnam Prabhakar: ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ఆఫర్.. అదేంటంటే?

Ponnam Prabhakar: ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే.. ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ఆఫర్.. అదేంటంటే?
Advertisement

Ponnam Prabhakar: తెలంగాణ వ్యాప్తంగా నేడు సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అటువంటి విమర్శలు చేసే వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూపర్ ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్ ఏమిటంటే?

హైదరాబాద్ జీహెచ్ఎంసి పరిధిలో మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సమగ్ర సర్వేను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వేలో పాల్గొనే ఎన్యుమరేటర్లకు సర్వే కిట్ మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

Advertisement

మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి సమగ్ర కుటుంబ సర్వేను ప్రారంభించామన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తమ నేత రాహుల్ గాంధీ సూచనలతో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో సర్వేను విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సర్వేకు ప్రజలు సహకరించాలని, సర్వే ద్వారా వచ్చిన డేటాతో భవిష్యత్ లో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తామన్నారు. ప్రజల సహకారం ఉంటేనే సర్వే సక్సెస్ అవుతుందన్నారు.

ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ఆఫర్..
రాష్ట్ర వ్యాప్తంగా సర్వే సాగుతున్న నేపథ్యంలో కొందరు సర్వేను రాజకీయం చేయాలని చూస్తున్నట్లు మంత్రి పొన్నం అన్నారు. అలాగే అనవసరంగా సమస్యలు సృష్టించకుండా, ఏవైనా సమస్యలు అంటే తనను నేరుగా అడగవచ్చని, లేకుంటే తనను సంప్రదించాలని ప్రతిపక్షాలకు సూచించారు. అందరి సూచనలు, సలహాలు తీసుకొనే సర్వే ప్రశ్నలు తయారు చేసినట్లు, 150 గృహాలకు ఒక ఎన్యుమరేటర్ సర్వే వివరాలు సేకరిస్తారన్నారు.

Advertisement

Also Read: Tirumala Updates: తిరుమల వెళ్తున్నారా.. అయితే ఈ సమాచారం మీకోసమే!

జిరాక్స్ పత్రాలు వద్దే.. వద్దు
సర్వే వివరాలు నమోదు చేసుకునేందుకు వచ్చే సర్వే సిబ్బందికి ఎలాంటి జిరాక్స్ పత్రాలు అవసరం లేదని మంత్రి అన్నారు. ఆధార్ కార్డు వివరాలు కూడా ఆప్షనల్ మాత్రమేనని, ఇంటిలో ఒక్కరూ ఉన్నా తమ కుటుంబ సభ్యుల వివరాలు తెలుపవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి 17లక్షల 44వేల గృహాలు ఉండగా, సర్వే కోసం 87 వేల 900 మందిని నియమించామన్నారు. మరి సర్వేపై సమస్యలు ఉన్న ప్రతిపక్ష నేతలు, నేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి ఎటువంటి అంశాలు తీసుకువస్తారో కానీ, మంత్రి మాత్రం నన్ను సంప్రదించండి అంటూ కోరారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×