Assembly Sessions: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రులు ఎమ్మెల్యేల సమావేశం ఎర్పాటు చేశారు. సెప్టెంబర్ 7 వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించిన అసెంబ్లీ సమావేశాల తేదీలు ఫిక్స్ చేశారు.
కొండా సురేఖ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడొద్దు పార్టీకి సంబంధించిన అంతర్గత విషయాలను బయటకు తీసుకురావద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు వద్దని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ బహిరంగ వేదికలపై పార్టీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా మాట్లాడకూడదని సీఎం హెచ్చరికలు జారీ చేశారు.
Also read: నామినేటెడ్ పదవుల భర్తీపై.. కీలక ప్రకటన చేసిన టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!
ఏ సమస్య ఉన్నా పార్టీ వేదికపైనే చర్చించాలి. అంతర్గత విభేదాలను మీడియా ముందుకు తీసుకురాకుండా పార్టీ సమావేశాల్లోనే పరిష్కరించుకోవాలని సూచనలు చేశారు. క్రమశిక్షణ విషయంలో రాజీ లేదు. పార్టీ నిర్ణయాలకు, నాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని సీఎం సంకేతాలిచ్చారు.
అందరూ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. వ్యక్తిగత వ్యాఖ్యలతో ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందులు రాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు సంయమనం పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. కొండా సురేఖ అంశం జాతీయ నాయకత్వం చూసుకుంటుందని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.
Also Read: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. 27న రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల గ్రామ సభలు