Varuna Yagam: సీఎం రేవంత్ రాష్ట్ర ప్రజలకోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10వ తేథీన నాగార్జున సాగర్లో వరుణ యాగం చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. వరుణ యాగానికి చేయడానికి ముహూర్తం ఆగస్టు 10వ తేదీని యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు మరియు వేద పండితులు, సిద్ధాంతిలు కలిసి ఫిక్స్ చేశారు. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
Also Read: పేరు మార్చుకుంటే నిజంగానే అదృష్టం మారుతుందా?
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు, నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువుల నిర్వహణ చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, రాష్ట్రంలోని ప్రజలకు పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు చేయాలని సీఎం తెలిపారు. దీనికోసం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సారథ్యంలో వరుణ యాగం చేయనున్నారు. యాగం అనంతరం మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గోననున్నారు.
Also Read: తెలంగాణ ప్రజలకు హై అలర్ట్.. రేపు ఆటోలు, క్యాబ్లు, స్విగ్గీ, జొమాటో సేవలు బంద్!