E-Paper
Advertisement

Mandula Samuel: నిరూపిస్తే లారీ కింద పడతా.. తుంగతుర్తి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Mandula Samuel: నిరూపిస్తే లారీ కింద పడతా.. తుంగతుర్తి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Advertisement

Mandula Samuel: తుంగతుర్తి రాజకీయ హవా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇసుక దందాపై వస్తున్న ఆరోపణలతో తుంగతుర్తి రాజకీయం యూటర్న్ తీసుకుంది. హరీశ్ రావు ఆరోపణలతో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మీడియా ముందుకు వచ్చారు.  దీంతో తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేను ఇసుక దందా చేస్తున్నట్లు ఎవరైనా నిరూపిస్తే, పోయి లారీ కింద పడతా” అని ఆయన చెప్పడం స్థానిక రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసింది. హరీశ్ రావు, తన నిందలు మోపడం సరికాదని మండిపడ్డారు. అసలు నీటి విలువ హరీశ్ రావుకు తెలుసా? హరీష్ రావుకు అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసంటూ మండిపడ్డారు. నీటి గురించి హరీశ్ రావు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.

Also Read: Okra Water Benefits: జిడ్డుగా ఉందని వదిలేయకండి.. నానబెట్టి తాగితే రోగాలన్నీ పరార్

Advertisement

మందుల సామేల్ మాట్లాడుతూ..  కాళేశ్వరానికి నేనే ఇంజనీర్ ను, కంకర మోసింది నేనే, రాళ్లు మోసింది నేనే అని కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ల హయాంలోనే కుప్పకూలింది .  కాళేశ్వరం గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వాళ్లు తెలిసింది దోపిడీ, దొంగతనాలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే భార్యా, భర్తలు మాట్లాడుతుంటే దొంగచాటుగా వినడం ఇలాంటివి మాత్రమే వాళ్లకు తెలుసని అన్నారు. కొద్ది రోజులు ఆగండి ఆ వ్యవహారం కూడా త్వరలో బయటకు వస్తుందన్నారు. కాళేశ్వరం కమీషన్ కథ వాళ్లకు మాత్రమే తెలుసన్నారు. స్వర్గీయ నాయని నర్సింహారెడ్డి అప్పుడే అన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కమీషన్ ప్రాజెక్ట్ అని అన్నారు. కాళేశ్వరానికి తొర్ర ఎందుకు పడిందో తలపెట్టి హరీశ్ రావును చూడమని అన్నారు.

గతంలో కిషోర్, జగదీశ్ రెడ్డి ఇసుక మొత్తం దోచుకున్నారని ఆరోపించారు. అధ్యక్ష పదవి కోసం కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నారని తీవ్రంగా స్పందించారు.  వాళ్లకు తెలంగాణపై, రాష్ట్ర ప్రజలపై సోయ లేదని వారన్నారు. నాణ్యత లేకుండా కాళేశ్వరం కట్టి ఇప్పుడు పక్కనున్న వారిపై నిందలు మోపడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది తెలంగాణ కోసం పోరాడి మీ చేతిల్లో పెడితే బీఆర్ఎస్ వాళ్లు చేసిన తతంగం ఇది అంటూ ఎమ్మెల్యే మందుల సామేల్ అంటూ మండిపడ్డారు.

Advertisement

 

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×