E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీగా, 42శాతం లోటు వర్షపాతం

హైదరాబాద్‌లో ఉదయం నుంచి వర్షం.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీగా, 42శాతం లోటు వర్షపాతం
Advertisement

Hyderabad Rains: దేశవ్యాప్తంగా రుతుపవనాల జోరు కొనసాగుతోంది.  ఓవైపు ఎండలు, మరోవైపు ఉక్కుపోతతో అల్లాడిపోయిన ప్రజలకు కాస్త రిలీఫ్. దేశవ్యాప్తంగా రుతుపవనాలు జోరుగా కదులుతున్నాయి. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.

దేశవ్యాప్తంగా రుతుపవనాలు జోరు

Advertisement

నైరుతి రుతుపవనాలు పశ్చిమ, మధ్య ఉత్తర భారత్ అంతా విస్తరించాయి. ఫలితంగా వివిధ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు అక్కడక్కడ కురిసినప్పటికీ జూన్ 4 నుంచి ఇప్పటివరకు  దేశం 42 శాతం వర్షపాత లోటు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

వాతావరణ శాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటికి 118.5 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 68.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది . దీంతో 42శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. కొద్దిరోజులుగా రుతుపవనాలు పుంజుకోవడంతో వర్షాలు పడుతున్నాయి.

Advertisement

హైదరాబాద్‌లో ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో వర్షం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు

దేశంలోని కొన్ని ప్రాంతాలలో మేఘాలు విస్తరించినట్టు తెలిపింది. దాదాపు మూడు వారాల తర్వాత రుతుపవనాల జోరు మొదలైనట్టు అంచనా వేసింది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదు అయ్యింది. గడిచిన 24 గంటల్లోపశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట్ర, పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో 12 నుండి 20 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని ఐఎమ్‌డి పేర్కొంది.

దక్షిణాదిలో వానలు పడుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో నగరవాసులు కాస్త ఉపశమనం కలిగింది. అలాగే మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలియజేసింది.

ALSO READ: పోలీసుల దురుసు ప్రవర్తన.. డీజీపీకి ఫిర్యాదు చేసిన వీహెచ్‌పీ 

తెలంగాణలోని ఉత్తర, తూర్పు, మధ్య జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. అదే సమయంలో దక్షిణ, పశ్చిమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. ఏపీ రాజధాని అమరావతిలోని వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ మేరకు.. రాబోయే ఐదు రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండబోవని పేర్కొంది.

వివిద ప్రాంతాల్లో వర్షం పడే సూచనలు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. జూన్ 26-27 వరకు ఇదే విధంగా వాతావరణం కొనసాగనుంది. జూన్ 27-28 మధ్య అనేక ప్రాంతాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలియజేసింది.

Related News

పోలీసుల దురుసు ప్రవర్తన.. డీజీపీకి ఫిర్యాదు చేసిన వీహెచ్‌పీ నేతలు, చర్యలు తీసుకుంటామని హామీ

Khairatabad Ganesh: ఈ సారీ ఖైరతాబాద్ బడా గణేష్ లుక్ ఇదే.. సరికొత్త అవతారంలో గణపయ్య!

Voter Revision: హైదరాబాద్‌లో తొలి రోజే తుస్సుమన్న సర్.. ఫారాలు లేక ఏజెంట్లు ఇళ్లకు జంప్!

ఫీజుల వివాదం.. ప్రైవేట్ కాలేజీలకు హైకోర్టులో భారీ ఊరట

నీటి సమస్యకు.. శాశ్వత పరిష్కారం కావాలి.. తుంగభద్ర వేదికగా సీఎం రేవంత్ విజ్ఞప్తి

Employee Insurance: ​ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్..!

ACB Raid: శామీర్‌పేట్ తహసీల్దార్ ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. దొరికిన బంగారం, వజ్రాలు చూస్తే మీ మైండ్ బ్లాకే..!

Big Stories

×