E-Paper
Advertisement

Vande Bharat Trains: 3 వందేభారత్ రైళ్లు డైవర్ట్.. ఏపీ ప్రయాణీకులకు అలర్ట్!

Vande Bharat Trains: 3 వందేభారత్ రైళ్లు డైవర్ట్.. ఏపీ ప్రయాణీకులకు అలర్ట్!
Advertisement

Indian Railways: ఆయా రైల్వే పనుల సందర్భంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తుంటారు. తాజాగా లూప్ లైన్ అప్ గ్రేడ్ పనుల కారణంగా మూడు వందేభారత్ రైళ్లను డైవర్ట్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ఈ దారి మళ్లింపు ఉంటుందని వెల్లడించారు. ఇంతకీ ఏ రూట్ లో రైల్వే పనులు చేయనున్నారు? ఏ వందేభారత్ రైళ్లు ఎప్పుడు దారి మళ్లించనున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

27 రోజుల పాటు 3 వందేభారత్ రైళ్ల మళ్లింపు

Advertisement

కర్నాటక నాగసముద్రం యార్డ్‌ లోని లూప్‌ లైన్‌ ను అప్‌ గ్రేడ్ పనులు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఓవర్‌హెడ్ ఎక్విప్‌ మెంట్ పోర్టల్‌ లను మార్చడం కోసం జూలై 2 నుంచి జూలై 28 వరకు పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 27 రోజుల పాటు  3 వందే భారత్ రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ప్రకటించింది.

⦿ కాచిగూడ- యశ్వంత్ పూర్(20703)

Advertisement

కాచిగూడ- యశ్వంత్‌ పూర్‌ మధ్య రాకపోకలు కొనసాగించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ (20703) బుధవారం తప్ప మిగతా అన్ని రోజుల పాటు మళ్లింపు కొనసాగుతుందన్నారు. ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, యశ్వంత్‌పూర్ మీదుగా నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

⦿ కలబురగి- SMVT బెంగళూరు(22231)

కలబురగి-SMVT బెంగళూరు మధ్య రాకపోకలు కొనసాగించే వందే భారత్ ఎక్స్ ప్రెస్(22231) శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల పాటు దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అనంతపురం, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, యలహంక మీదుగా మళ్లించబడుతుందని వెల్లడించారు.

⦿ SMVT- కలబురిగి(22232)

SMVT బెంగళూరు నుంచి కలబురగి వరకు నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్(22232) గురువారం మినహా మిగతా అన్ని రోజుల పాటు దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు యలహంక, పెనుకొండ, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ధర్మవరం, అనంతపురం మార్గంలో నడుస్తుంది.

Read Also: రూ.11కే విమాన ప్రయాణం.. విదేశాలకూ ఎగిరిపోవచ్చు!

ప్రయాణీకులకు రైల్వే అధికారుల సూచన

సుమారు 27 రోజుల పాటు 3 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు డైవర్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులు పూర్తి వివరాలను తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. అందుకు అనుగుణంగా రాకపోకలకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముందస్తుగా నిర్ణయం తీసుకోవడం మంచిదని అధికారులు సలహా ఇచ్చారు.

Read Also: రైలు టికెట్ ధరలు పెరుగుతాయ్.. కానీ, వీటికి మాత్రం కాదు!

Related News

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

ప్రయాణికులకు అలర్ట్.. 36 రోజుల పాటు రైళ్లకు అంతరాయం!

రైలులో సిగరెట్ తాగిన వేస్ట్ ఫెలో.. ఒక్కసారే రైల్లో అలజడి, ఏమైందా అని చూస్తే..

రూ.50 వేల బడ్జెట్‌లో ఫారిన్ ట్రిప్.. భారతీయుల కోసం ఈ 7 దేశాలు బెస్ట్

200 ఏళ్ల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల.. రథంపై ఊరేగించి ఘన స్వాగతం!

అందంగా కనిపిస్తాయి.. కానీ, అడుగు పెడితే అంతే సంగతులు!

Big Stories

Advertisement
×