BigTV English

Vande Bharat Trains: 3 వందేభారత్ రైళ్లు డైవర్ట్.. ఏపీ ప్రయాణీకులకు అలర్ట్!

Vande Bharat Trains: 3 వందేభారత్ రైళ్లు డైవర్ట్.. ఏపీ ప్రయాణీకులకు అలర్ట్!

Indian Railways: ఆయా రైల్వే పనుల సందర్భంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తుంటారు. తాజాగా లూప్ లైన్ అప్ గ్రేడ్ పనుల కారణంగా మూడు వందేభారత్ రైళ్లను డైవర్ట్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ఈ దారి మళ్లింపు ఉంటుందని వెల్లడించారు. ఇంతకీ ఏ రూట్ లో రైల్వే పనులు చేయనున్నారు? ఏ వందేభారత్ రైళ్లు ఎప్పుడు దారి మళ్లించనున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


27 రోజుల పాటు 3 వందేభారత్ రైళ్ల మళ్లింపు

కర్నాటక నాగసముద్రం యార్డ్‌ లోని లూప్‌ లైన్‌ ను అప్‌ గ్రేడ్ పనులు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఓవర్‌హెడ్ ఎక్విప్‌ మెంట్ పోర్టల్‌ లను మార్చడం కోసం జూలై 2 నుంచి జూలై 28 వరకు పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 27 రోజుల పాటు  3 వందే భారత్ రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ప్రకటించింది.


⦿ కాచిగూడ- యశ్వంత్ పూర్(20703)

కాచిగూడ- యశ్వంత్‌ పూర్‌ మధ్య రాకపోకలు కొనసాగించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ (20703) బుధవారం తప్ప మిగతా అన్ని రోజుల పాటు మళ్లింపు కొనసాగుతుందన్నారు. ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, యశ్వంత్‌పూర్ మీదుగా నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.

⦿ కలబురగి- SMVT బెంగళూరు(22231)

కలబురగి-SMVT బెంగళూరు మధ్య రాకపోకలు కొనసాగించే వందే భారత్ ఎక్స్ ప్రెస్(22231) శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల పాటు దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అనంతపురం, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, యలహంక మీదుగా మళ్లించబడుతుందని వెల్లడించారు.

⦿ SMVT- కలబురిగి(22232)

SMVT బెంగళూరు నుంచి కలబురగి వరకు నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్(22232) గురువారం మినహా మిగతా అన్ని రోజుల పాటు దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు యలహంక, పెనుకొండ, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ధర్మవరం, అనంతపురం మార్గంలో నడుస్తుంది.

Read Also: రూ.11కే విమాన ప్రయాణం.. విదేశాలకూ ఎగిరిపోవచ్చు!

ప్రయాణీకులకు రైల్వే అధికారుల సూచన

సుమారు 27 రోజుల పాటు 3 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు డైవర్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులు పూర్తి వివరాలను తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. అందుకు అనుగుణంగా రాకపోకలకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముందస్తుగా నిర్ణయం తీసుకోవడం మంచిదని అధికారులు సలహా ఇచ్చారు.

Read Also: రైలు టికెట్ ధరలు పెరుగుతాయ్.. కానీ, వీటికి మాత్రం కాదు!

Related News

IRCTC Tour Package: మ్యాజిక్ మేఘాలయా టూర్.. IRCTC అదిరిపోయే ప్యాకేజ్, అస్సలు మిస్ అవ్వద్దు!

Tatkal Booking: ఈ 5 చిట్కాలు పాటిస్తే.. సెకన్లలో వ్యవధిలో తాత్కాల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు!

Russia – Ukraine: డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డ రష్యా, ముక్కలు ముక్కలైన ఉక్రెయిన్ ప్యాసింజర్ రైలు!

Free Train Travel: ఇండియాలో స్పెషల్ రైలు, ఇందులో టికెట్ లేకుండా ఫ్రీగా జర్నీ చెయ్యొచ్చు!

Train Journey: 300 మైళ్ల ప్రయాణం.. రూ. 350కే టికెట్.. మయన్మార్ లో ట్రైన్ జర్నీ ఇలా ఉంటుందా?

Sensor Toilet: ఆ రైలులో ‘సెన్సార్’ టాయిలెట్.. మనోళ్లు ఉంచుతారో, ఊడపీకుతారో!

Pregnancy tourism: ప్రెగ్నెన్సీ టూరిజం గురించి ఎప్పుడైనా విన్నారా! ఆ ప్రాంతం ఎక్కడ ఉందంటే?

IndiGo flights: ఐదేళ్ల తర్వాత చైనాకు ఇండిగో సర్వీసు.. కోల్‌కతా నుంచి మొదలు, టికెట్ల బుకింగ్ ప్రారంభం

Big Stories

×