Indian Railways: ఆయా రైల్వే పనుల సందర్భంగా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తుంటారు. తాజాగా లూప్ లైన్ అప్ గ్రేడ్ పనుల కారణంగా మూడు వందేభారత్ రైళ్లను డైవర్ట్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వచ్చే నెలలో ఈ దారి మళ్లింపు ఉంటుందని వెల్లడించారు. ఇంతకీ ఏ రూట్ లో రైల్వే పనులు చేయనున్నారు? ఏ వందేభారత్ రైళ్లు ఎప్పుడు దారి మళ్లించనున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
27 రోజుల పాటు 3 వందేభారత్ రైళ్ల మళ్లింపు
కర్నాటక నాగసముద్రం యార్డ్ లోని లూప్ లైన్ ను అప్ గ్రేడ్ పనులు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఓవర్హెడ్ ఎక్విప్ మెంట్ పోర్టల్ లను మార్చడం కోసం జూలై 2 నుంచి జూలై 28 వరకు పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో 27 రోజుల పాటు 3 వందే భారత్ రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) ప్రకటించింది.
⦿ కాచిగూడ- యశ్వంత్ పూర్(20703)
కాచిగూడ- యశ్వంత్ పూర్ మధ్య రాకపోకలు కొనసాగించే వందేభారత్ ఎక్స్ ప్రెస్ (20703) బుధవారం తప్ప మిగతా అన్ని రోజుల పాటు మళ్లింపు కొనసాగుతుందన్నారు. ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, యశ్వంత్పూర్ మీదుగా నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
⦿ కలబురగి- SMVT బెంగళూరు(22231)
కలబురగి-SMVT బెంగళూరు మధ్య రాకపోకలు కొనసాగించే వందే భారత్ ఎక్స్ ప్రెస్(22231) శుక్రవారం మినహా మిగతా అన్ని రోజుల పాటు దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు అనంతపురం, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ, యలహంక మీదుగా మళ్లించబడుతుందని వెల్లడించారు.
⦿ SMVT- కలబురిగి(22232)
SMVT బెంగళూరు నుంచి కలబురగి వరకు నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్(22232) గురువారం మినహా మిగతా అన్ని రోజుల పాటు దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు యలహంక, పెనుకొండ, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ధర్మవరం, అనంతపురం మార్గంలో నడుస్తుంది.
Read Also: రూ.11కే విమాన ప్రయాణం.. విదేశాలకూ ఎగిరిపోవచ్చు!
ప్రయాణీకులకు రైల్వే అధికారుల సూచన
సుమారు 27 రోజుల పాటు 3 వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు డైవర్ట్ చేస్తున్న నేపథ్యంలో ప్రయాణీకులు పూర్తి వివరాలను తెలుసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. అందుకు అనుగుణంగా రాకపోకలకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ముందస్తుగా నిర్ణయం తీసుకోవడం మంచిదని అధికారులు సలహా ఇచ్చారు.
Read Also: రైలు టికెట్ ధరలు పెరుగుతాయ్.. కానీ, వీటికి మాత్రం కాదు!