E-Paper
Advertisement

AP New National Highway: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. సాగర తీరానికి కళ వచ్చేసిందోచ్!

AP New National Highway: ఏపీకి కొత్త నేషనల్ హైవే.. సాగర తీరానికి కళ వచ్చేసిందోచ్!

AP New National Highway: ఏదైనా మార్పు నిశ్శబ్దంగా వస్తుంది. ముందుగా ప్రజలకు పెద్దగా తెలియదు. కానీ ఆ మార్పు ఒకేచోటే నిలవదు.. ప్రాంతాన్ని, ప్రజల జీవనశైలిని పూర్తిగా మార్చేస్తుంది. అలాంటి ఘట్టమే ప్రస్తుతం ఏపీ తీర ప్రాంతాన్ని తాకబోతోంది. ఓ ఊహించని మార్గంలో, ఓ నూతన మార్గం రూపంలో.. శ్రీకాకుళం నుంచి భీమిలి వరకూ 200 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ తీర జాతీయ రహదారికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అవును.. నిశ్శబ్దంగా ఏపీ తీరాన్ని మలుపు తిప్పే ప్రాజెక్టుకి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది కేవలం రహదారి కాదని, ఏపీ అభివృద్ధికి వేరొక అక్షరం చేర్చే అవకాశంగా మారబోతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ రహదారి శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నుంచి ప్రారంభమై, విశాఖపట్నంలోని భీమిలి వరకూ సాగనుంది.

దీనిలోప్రత్యేకత ఏమిటంటే.. ఇది పూర్తిగా కొత్తగా (Greenfield alignment) నిర్మించబడుతున్న జాతీయ రహదారి. ప్రస్తుతం ఉన్న రహదారులను పక్కనపెట్టి, సరిగా తీరాన్ని ఆనుకుని వెళ్తూ.. పర్యాటకానికి, వాణిజ్యానికి, వృద్ధికి ఊతమివ్వబోయే మార్గం ఇది.

ఈ రహదారి ద్వారా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం మరియు మూలపేట పోర్టు లాంటి కీలక కేంద్రాలు ఒకే లైన్‌లో కనెక్టవుతాయి. ఇది లాజిస్టిక్స్ రంగానికి వరంగా మారనుంది. ఓ స్మార్ట్ కనెక్టివిటీ మోడల్‌గా అభివృద్ధి చేయబడుతోంది. ఒకవైపు విమానాశ్రయం, మరోవైపు పోర్ట్ – మధ్యలో సముద్రతీర పర్యాటక ప్రాంతాలు, మత్స్య పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఫాక్టరీలు – అన్నీ ఒకే లూప్‌లోకి వస్తాయంటే ఎంతటి మార్పు జరిగే అవకాశం ఉందో ఊహించవచ్చు.

ఇప్పటికే కేంద్రం దీనికి ఆమోదం తెలిపింది. ఇక భూసేకరణ బాధ్యతను ఏపీ ప్రభుత్వం చేపట్టనుంది. అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే వివరాల ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇది పూర్తయిన తర్వాత నిర్మాణానికి ఆమోదం ఇచ్చి పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Also Read: Vizag Metro Project: విశాఖ మెట్రోపై లేటెస్ట్ అప్ డేట్.. ఎన్ని ఫ్లై ఓవర్లు వస్తున్నాయంటే?

ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తరాంధ్రలోని ప్రజలకు ప్రత్యక్షంగా లాభం కలుగుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని గ్రామాలు – ఈ రహదారి ద్వారా ప్రధాన నగరాలతో కనెక్టవుతాయి. వ్యాపారం, ఉద్యోగాలు, పర్యాటక ఆవకాశాలు పెరుగుతాయి. ఇప్పటికే భీమిలి, భోగాపురం ప్రాంతాల్లోని బీచ్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో – ఈ రహదారి ప్రాజెక్ట్ మరింత కీలకంగా మారుతుంది.

అంతేకాదు, ఈ రహదారి వల్ల సముద్రతీరంలో ఉన్న మత్స్యకార గ్రామాలు రవాణా సదుపాయాలు మెరుగుపరుచుకుంటాయి. చేపల ఉత్పత్తిని వేగంగా, తక్కువ ఖర్చుతో మార్కెట్‌కు తరలించే అవకాశం ఉంటుంది. ఇది ఆయా గ్రామాల్లోని ఆర్థిక పరిస్థితులను మార్చే దిశగా పని చేస్తుంది. మరింత ప్రైవేట్ పెట్టుబడులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్‌లు, లాజిస్టిక్ హబ్‌లు ఏర్పడే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. పర్యాటక రంగాన్ని మరింత ఆకర్షణీయంగా మలచేందుకు ఇది బలమైన అడుగు. ఈ రహదారి పక్కనే సైక్లింగ్ ట్రాకులు, తీరాన వ్యూవింగ్ డెక్స్, బీచ్ కేఫేలాంటి పర్యాటక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. తద్వారా ఇది అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయగలిగే రహదారి మార్గంగా నిలుస్తుంది.

ఇది కేవలం ఒక రహదారి నిర్మాణం మాత్రమే కాదు.. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేసిన వేగదున్న సంతకంలాంటిది. ఈ మార్గం పూర్తవ్వగానే, ఉత్తరాంధ్ర దశలు మారిన అభివృద్ధి ప్రాంతంగా వెలుగులోకి రావడం ఖాయం.

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×