E-Paper
Advertisement

East Coast Railway: 32 రైళ్లకు అదనపు కోచ్ లు, తెలుగు ప్రయాణీకులకు ఆ కష్టాలు తీరినట్లే!

East Coast Railway: 32 రైళ్లకు అదనపు కోచ్ లు, తెలుగు ప్రయాణీకులకు ఆ కష్టాలు తీరినట్లే!
Advertisement

Indian Railways: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజలు తమ సొంత గ్రామాల నుంచి నగరాలకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిసిపోతున్నాయి. అధిక డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల(జూన్)లో 32 రైళ్లను అదనపు కోచ్ లో నడిపించాలని నిర్ణయించింది. AC 2-టైర్, AC 3-టైర్, స్లీపర్ క్లాస్, చైర్ కార్‌తో సహా ఇతర కోచ్ లను యాడ్ చేయబోతోంది. ఈ రైళ్లు న్యూఢిల్లీ, హౌరా, యశ్వంత్‌ పూర్, పాట్నా, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, కిరండూల్ వంటి కీలక గమ్యస్థానాలను కవర్ చేస్తాయి. ప్రధాన మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లకు మెరుగైన సౌలభ్యం, ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల వరకు కొనసాగుతాయని వెల్లడించారు.

అదనపు కోచ్ లు పెంచిన రైళ్ల వివరాలు

Advertisement

⦿ విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్ (58506/58505): ఈ రైలుకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను పెంచారు. జూన్ 1 నుంచి జూన్ 30 వరకు నడపనున్నారు.

⦿ విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502): ఈ రైలుకు కూడా స్లీపర్ కోచ్ ను యాడ్ చేశారు.  జూన్ 1 నుండి 30 వరకు (విశాఖపట్నం నుంచి), జూన్ 2 నుండి జూలై 1 వరకు (కిరండూల్ నుంచి) ఈ కోచ్ అందుబాటులో ఉంటుంది.

Advertisement

⦿ విశాఖపట్నం-బెంగళూరు స్పెషల్ (08581/08582): ఈ రైలుకు ఒక AC 3-టైర్ కోచ్ ను అదనంగా జత చేయనున్నారు. జూన్ 1 నుంచి 29 వరకు (విశాఖపట్నం నుంచి) / జూన్ 2 నుంచి 29 వరకు (బెంగళూరు నుంచి) ఈ కోచ్ అందుబాటులో ఉంటుంది.

⦿ విశాఖపట్నం-తిరుపతి స్పెషల్(08547/08548): ఈ రైలుకు ఒక AC 3-టైర్ కోచ్ జతచేయనున్నారు. జూన్ 4 నుంచి 25 వరకు (విశాఖపట్నం నుంచి),  జూన్ 5 నుంచి 26 వరకు (తిరుపతి నుండి) ఈ అదనపు కోచ్ తో రైలు నడవనుంది.

⦿ విశాఖపట్నం-చర్లపల్లి స్పెషల్(08579/08580): విశాఖపట్నం- చర్లపల్లి మధ్య రాకపోకలు కొనసాగించే ఈ ప్రత్యేక రైలుకు  అదనంగా ఒక AC 3-టైర్ కోచ్ ను యాడ్ చేయనున్నారు. జూన్ 6 నుంచి 27 వరకు (విశాఖపట్నం నుంచి),  జూన్ 7 నుంచి 28 వరకు (చర్లపల్లి నుంచి) ఈ కోచ్ అందుబాటులో ఉంటుంది.

Read Also: ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? కొత్త రూల్స్ గురించి తెలియకపోతే బుక్కైపోతారు!

అటు  భువనేశ్వర్ – హౌరా జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ – న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్,  భువనేశ్వర్-న్యూఢిల్లీ రాజధాని, భువనేశ్వర్-జునాగఢ్ రోడ్ ఎక్స్‌ప్రెస్, పూరి-షాలిమార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్, పూరి–యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్,  పూరి–బంగిరిపోసి ఎక్స్‌ప్రెస్, పూరి–పాట్నా స్పెషల్, సంబల్‌పూర్–నాందేడ్ ఎక్స్‌ప్రెస్, సంబల్‌పూర్-ఈరోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కూడా అదనపు కోచ్ లను యాడ్ చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఆయా మార్గాల్లో ప్రయాణించే ప్యాసింజర్లు సమీప రైల్వే స్టేషన్లతో పాటు ఇండియన్ రైల్వే అధికారిక వెబ్ సైట్ ఈ వివరాలను తెలుసుకోచ్చన్నారు.

Read Also: 60 సెకెన్లలో కన్ఫర్మ్ టికెట్ బుకింగ్, సింఫుల్ గా ఇలా చేయండి!

Related News

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

వర్షాకాలంలో ప్రాణం పోసుకునే అద్భుతమైన లోయలు.. ఒక్కసారైనా తప్పకుండా చూడాల్సిందే!

వీరనారి రుద్రమదేవి మరణ రహస్యం.. 1289లో పానగల్లులో ఏం జరిగింది?

వర్షాకాలంలో ఊటీ కంటే బెటర్ హిల్ స్టేషన్.. కోటగిరిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు

‘సెకండ్ క్లాస్ ప్యాసింజర్’ ఏంటి? నిప్పులు చెరిగిన అత్యున్నత న్యాయస్థానం!

బస్సులో, రైలులో కొందరు సౌండ్ పెద్దగా పెట్టి వీడియోలు చూస్తారు.. ఎందుకో తెలుసా?

Big Stories

Advertisement
×