E-Paper
Advertisement

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Dubai Police:

తమిళనాడుకు చెందిన యూట్యూబర్ మదన్ గౌరీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పలు దేశాల్లో పర్యటిస్తూ అక్కడి వింతలు విశేషాలు నెటిజన్లతో పంచుకుంటాడు. ఆయన యూట్యూబ్ చానెల్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. తను పెట్టే వీడియోలను చాలా మంది ఆసక్తిగా చూస్తుంటారు. ఇక రీసెంట్ గా గౌరీ దుబాయ్ కి వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో తన ఫోన్ పోగొట్టుకున్నాడు. తన ఫోన్ ను వెతికి పెట్టాల్సిందిగా అతడు దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక తాజాగా ఆయన ఫోన్ ను సేఫ్ గా చెన్నైకి పంపిచారు దుబాయ్ పోలీసులు. అదీ పూర్తిగా ఉచితంగా. ఈ విషయాన్ని గౌరీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

పోగొట్టుకున్న ఫోన్ ఎలా తిరిగి వచ్చింది?

గౌరీ వారం క్రితం దుబాయ్ విమానాశ్రయంలో తన ఫోన్ పోగొట్టుకున్నట్లు వెల్లడించాడు. అక్కడి పోలీస్ సిబ్బంది నుంచి సహాయం కోరినప్పుడు, వారు ఫోన్ వివరాలను ఇమెయిల్ చేయమని మాత్రమే అడిగారు. చెన్నైకి తిరిగి వచ్చిన తర్వాత, తన ఫోన్ దొరికిందని నిర్ధారిస్తూ అతనికి ఇమెయిల్ వచ్చింది. ఆ తర్వాత దుబాయ్ పోలీసులు ఆ సెల్ ఫోన్ ను అక్కడి నుంచి విమానంలో ఉచితంగా చెన్నైకి తిరిగి పంపించే ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన దుబాయ్ పోలీసులకు కృతజ్ఞతలు చెప్తూ వీడియో షేర్ చేశాడు. అందులో పోలీసుల పనితీరును ప్రశంసించారు.

నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఈ ఘటనకు సంబంధిచిన వీడియోను సెప్టెంబర్ 2న గౌరీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 2.6 మిలియన్ల వ్యూస్ అందుకుంది. 2 లక్షలకు పైగా లైక్‌ లను సంపాదించింది. నెటిజన్లు పోయిన ఫోన్‌ ను సజావుగా తిరిగి పొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  అదే సమయంలో దుబాయ్ అధికారుల పని తీరును ప్రశంసించారు.“ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశం దుబాయ్” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.“దుబాయ్‌ లో అత్యంత ఉత్తమమైన పోలీసులు ఉన్నారు. అక్కడ ఏదైనా పోగొట్టుకున్నా, సేఫ్ గా అందించడంలో ముందుంటారు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “దుబాయ్‌ ని చాలా మంది ఇష్టపడుతారు. ఎందుకు ఇష్టపడుతారు అనేది ఇప్పుడు అర్థం అయ్యింది” అని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ పోలీస్ వ్యవస్థ   

దుబాయ్ లో భద్రత విషయంలో కఠినమైన చట్టాలు అమల్లో ఉంటాయి. అంతేకాదు, పోలీసు వ్యవస్థ పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. దుబాయ్ లో పోయిన వస్తువులను అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఈజీగా కనిపెట్టేస్తారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల భద్రత పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి తమ దేశంలో ఎలాంటి అసౌకర్యం కలగకూడదని భావిస్తారు. అందులో భాగంగానే గౌరీ ఫోన్ ను సురక్షితంగా ఇండియాకు పంపించారు.

Read Also: గుడిలో చోరీ.. ఆ తర్వాతి రోజే దొంగ ఇంట్లో ఊహించని ఘటన, దెబ్బకు డబ్బులు తిరిగిచ్చేశాడు!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×