BigTV English

Free Train Journey: టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు.. వారు మాత్రమే సుమా!

Free Train Journey: టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు.. వారు మాత్రమే సుమా!

Travel In Train Without Ticket: ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ‘మిలీనియం గిఫ్ట్’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ఉచిత నెలవారీ సీజన్ టికెట్లు అందించనుంది. ఈ పాస్ లను విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టూడెంట్స్ తమ నివాస స్థలం, స్కూల్ మధ్య ప్రయాణించడానికి ఈ పాస్ లను అందించనుంది. విద్యార్థులకు రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా ఎడ్యుకేషన్ కు సపోర్టు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..


‘మిలీనియం గిఫ్ట్’ స్కీమ్ కు అర్హులు ఎవరంటే?

10వ తరగతి వరకు బాలురకు ఈ పథకం ద్వారా ఉచిత పాస్ అందిస్తారు. ఇక బాలికల విషయానికి వస్తే, 12వ తరగతి వరకు చదివే వాళ్లకు అందిస్తారు. ఇది వారి నివాసం, పాఠశాలకు మధ్య ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది.


ఉచిత టికెట్ గురించి..

ఈ పథకం కింద నెలవారీ సీజన్ టికెట్లు మాత్రమే జారీ చేయబడతాయి. త్రైమాసిక సీజన్ టికెట్లు అందించబడవు. ఈ పాస్ కేవలం సెకెండ్ క్లాస్ లో ప్రయాణించడానికే ఉపయోగపడుతుంది.  గరిష్ట దూరం 150 కి.మీ వరకు కవర్ చేస్తుంది. సూపర్‌ఫాస్ట్ రైళ్లతో సహా మెయిల్/ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో ఈ పాస్ తో ప్రయాణించడం కుదరదు. ముంబైలోని కొన్ని ప్రాంతాలలో CIDCO సర్‌ ఛార్జ్ లాంటి అదనపు ఛార్జ్‌లు విధించబడవు. విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల నుంచి బోన ఫైడ్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. ఈ పథకం విద్యార్థులకు రాయితీ MSTల మాదిరిగానే షరతులకు లోబడి ఉంటుంది. ఈ టికెట్లపై రైల్వేస్ నుంచి మిలీనియం గిఫ్ట్ అనే స్కీమ్ అనే సీల్ వేసి ఉంటుంది.

ఈ పాస్ లు ఎందుకు ప్రవేశ పెట్టారంటే?

ఈ పాస్ లు ముఖ్యంగా గ్రామీణ, శివారు ప్రాంతాలలోని విద్యార్థులకు సరసమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అదే సమయంలో విద్యను ప్రోత్సహించడానికి సాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పథకం భారతీయ రైల్వే విద్యార్థులకు రాయితీలను అందించడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో భాగం. ఇందులో జనరల్, SC/ST కేటగిరీ విద్యార్థులకు స్వస్థల ప్రయాణం, విద్యా పర్యటనలు, ప్రవేశ పరీక్షలకు రాయితీ ఛార్జీలు కూడా ఉన్నాయి.  జనరల్ కేటగిరీ విద్యార్థులు స్వస్థలం, విద్యా పర్యటనలకు 2వ, స్లీపర్ క్లాస్‌ లో  50% రాయితీతో వెళ్లే అవకాశం ఉంటుంది. SC/ST కేటగిరీ విద్యార్థులకు 75% రాయితీ లభిస్తుంది.

ఈ పాస్ పొందాలంటే ఎలా?

విద్యార్థులు సమీపంలోని రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. చెల్లుబాటు అయ్యే  ID ప్రూఫ్, చదువుతున్న స్కూల్, కాలేజీ నుంచి బోనాఫైడ్ సర్టిఫికేట్ అందించాలి. ఆ తర్వాత MST అనేది ప్రయాణీకుల పేరు, వయస్సు, స్టేషన్లు, తరగతి, చెల్లుబాటు అయ్యే వివరాలను కలిగి ఉన్న ప్లాస్టిక్-కోటెడ్ కార్డ్‌ గా జారీ చేయబడుతుంది.  ప్రయాణ సమయంలో చెకింగ్ అధికారులకు ఈ పాస్ ను చూపించాల్సి ఉంటుంది.

Read Also: 180 ఏళ్లు నడిచిన రాయల్ రైలుకు గుడ్ బై, చివరి స్టాప్ కు చేరేది ఎప్పుడంటే?

Related News

Hydrogen Train: హైడ్రోజన్ రైలు వస్తోంది.. ఫస్ట్ సర్వీస్ అక్కడే.. వీడియో రిలీజ్ చేసిన రైల్వే మంత్రి!

Tax Relief: మీ పెంపుడు జంతువులను సింహాలకు ఆహారంగా ఇస్తే.. ట్యాక్స్ నుంచి ఉపశమనం!

Escalators at Mountains: ఏకంగా పర్వతాలకే ఎస్కలేటర్లు.. చైనా వాళ్లు మామూలోళ్లు కాదండోయ్!

Tirumala rules: తిరుమలకు వచ్చే వాహనాలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 15 నుండి కొత్త రూల్స్!

Free Wi-Fi: రైల్వే స్టేషన్ లో హ్యాపీగా వైఫై ఎంజాయ్ చెయ్యొచ్చు, సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

Air India Flights: అమెరికాకు ఎయిర్ ఇండియా విమానాలు బంద్, ప్రయాణీలకు అలర్ట్!

Big Stories

×