E-Paper
Advertisement

Free Train Journey: టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు.. వారు మాత్రమే సుమా!

Free Train Journey: టికెట్ లేకుండా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చు.. వారు మాత్రమే సుమా!

Travel In Train Without Ticket: ఇండియన్ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే ‘మిలీనియం గిఫ్ట్’ అనే పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకం కింద ఉచిత నెలవారీ సీజన్ టికెట్లు అందించనుంది. ఈ పాస్ లను విద్యార్థుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టూడెంట్స్ తమ నివాస స్థలం, స్కూల్ మధ్య ప్రయాణించడానికి ఈ పాస్ లను అందించనుంది. విద్యార్థులకు రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా ఎడ్యుకేషన్ కు సపోర్టు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

‘మిలీనియం గిఫ్ట్’ స్కీమ్ కు అర్హులు ఎవరంటే?

10వ తరగతి వరకు బాలురకు ఈ పథకం ద్వారా ఉచిత పాస్ అందిస్తారు. ఇక బాలికల విషయానికి వస్తే, 12వ తరగతి వరకు చదివే వాళ్లకు అందిస్తారు. ఇది వారి నివాసం, పాఠశాలకు మధ్య ప్రయాణించేందుకు ఉపయోగపడుతుంది.

ఉచిత టికెట్ గురించి..

ఈ పథకం కింద నెలవారీ సీజన్ టికెట్లు మాత్రమే జారీ చేయబడతాయి. త్రైమాసిక సీజన్ టికెట్లు అందించబడవు. ఈ పాస్ కేవలం సెకెండ్ క్లాస్ లో ప్రయాణించడానికే ఉపయోగపడుతుంది.  గరిష్ట దూరం 150 కి.మీ వరకు కవర్ చేస్తుంది. సూపర్‌ఫాస్ట్ రైళ్లతో సహా మెయిల్/ఎక్స్‌ ప్రెస్ రైళ్లలో ఈ పాస్ తో ప్రయాణించడం కుదరదు. ముంబైలోని కొన్ని ప్రాంతాలలో CIDCO సర్‌ ఛార్జ్ లాంటి అదనపు ఛార్జ్‌లు విధించబడవు. విద్యార్థులు తమ పాఠశాల, కళాశాల నుంచి బోన ఫైడ్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. ఈ పథకం విద్యార్థులకు రాయితీ MSTల మాదిరిగానే షరతులకు లోబడి ఉంటుంది. ఈ టికెట్లపై రైల్వేస్ నుంచి మిలీనియం గిఫ్ట్ అనే స్కీమ్ అనే సీల్ వేసి ఉంటుంది.

ఈ పాస్ లు ఎందుకు ప్రవేశ పెట్టారంటే?

ఈ పాస్ లు ముఖ్యంగా గ్రామీణ, శివారు ప్రాంతాలలోని విద్యార్థులకు సరసమైన ప్రయాణాన్ని అందిస్తాయి. అదే సమయంలో విద్యను ప్రోత్సహించడానికి సాయపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ పథకం భారతీయ రైల్వే విద్యార్థులకు రాయితీలను అందించడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నాలలో భాగం. ఇందులో జనరల్, SC/ST కేటగిరీ విద్యార్థులకు స్వస్థల ప్రయాణం, విద్యా పర్యటనలు, ప్రవేశ పరీక్షలకు రాయితీ ఛార్జీలు కూడా ఉన్నాయి.  జనరల్ కేటగిరీ విద్యార్థులు స్వస్థలం, విద్యా పర్యటనలకు 2వ, స్లీపర్ క్లాస్‌ లో  50% రాయితీతో వెళ్లే అవకాశం ఉంటుంది. SC/ST కేటగిరీ విద్యార్థులకు 75% రాయితీ లభిస్తుంది.

ఈ పాస్ పొందాలంటే ఎలా?

విద్యార్థులు సమీపంలోని రైల్వే స్టేషన్ టికెట్ కౌంటర్‌ లో దరఖాస్తు చేసుకోవాలి. చెల్లుబాటు అయ్యే  ID ప్రూఫ్, చదువుతున్న స్కూల్, కాలేజీ నుంచి బోనాఫైడ్ సర్టిఫికేట్ అందించాలి. ఆ తర్వాత MST అనేది ప్రయాణీకుల పేరు, వయస్సు, స్టేషన్లు, తరగతి, చెల్లుబాటు అయ్యే వివరాలను కలిగి ఉన్న ప్లాస్టిక్-కోటెడ్ కార్డ్‌ గా జారీ చేయబడుతుంది.  ప్రయాణ సమయంలో చెకింగ్ అధికారులకు ఈ పాస్ ను చూపించాల్సి ఉంటుంది.

Read Also: 180 ఏళ్లు నడిచిన రాయల్ రైలుకు గుడ్ బై, చివరి స్టాప్ కు చేరేది ఎప్పుడంటే?

Related News

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

మీరు వెళ్లాల్సిన రైలు లేటయ్యిందా? డోంట్ వర్రీ.. హ్యాపీగా రైల్వే స్టేషన్ లో ఏసీ రూమ్ బుక్ చేసుకోండి!

Big Stories

×