BigTV English
Advertisement

IRCTC South India Divine Tour : దక్షిణభారత్ టూర్ ప్లాన్.. తక్కువ ధరకే రైలు ప్రయాణం ఎంజాయ్ చేస్తూ ప్రముఖ ఆలయాల దర్శనం

IRCTC South India Divine Tour : దక్షిణభారత్ టూర్ ప్లాన్.. తక్కువ ధరకే రైలు ప్రయాణం ఎంజాయ్ చేస్తూ ప్రముఖ ఆలయాల దర్శనం

IRCTC South India Divine Tour | టూర్లకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త! ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ.. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.


దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 8 రాత్రులు మరియు 9 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ జూన్ 22న ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

టూర్ వివరాలిలా ఉన్నాయి..
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మొదటి రోజు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి స్టేషన్ల నుంచి పర్యాటకులు ఈ టూరిస్ట్ రైలు ఎక్కవచ్చు.


రెండో రోజు: తిరువన్నామలై చేరుకుంటారు. ఇక్కడ అరుణాచలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

మూడో రోజు: రామేశ్వరం బయల్దేరాలి. ఇక్కడ స్థానిక ఆలయాలను దర్శించుకోవచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేయొచ్చు.

నాలుగో రోజు: రామేశ్వరం నుంచి మదురై బయల్దేరాలి. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత కన్యాకుమారి బయల్దేరాలి.

ఐదో రోజు: కన్యాకుమారిలో రాక్ మెమొరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ వంటి ప్రాంతాలను చూడొచ్చు. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి.

ఆరో రోజు: త్రివేండ్రం బయల్దేరాలి. ఇక్కడ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్‌ను దర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరుచిరాపల్లి బయల్దేరాలి.

ఏడో రోజు: శ్రీరంగం ఆలయం మరియు బృహదీశ్వర ఆలయం దర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

ఎనిమిదో  రోజు: పర్యాటకులు తమతమ స్టేషన్లలో టూరిస్ట్ రైలు దిగడంతో టూర్ ముగుస్తుంది.

Also Read: శివరాత్రి స్పెషల్ టూర్.. యాదాద్రి, శ్రీశైలం సందర్శన

టూర్ ప్యాకేజీలు, ధరలు:
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్లో తెలుసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

ఎకానమీ ప్యాకేజీ: రూ. 14,250 (స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్-ఏసీ హోటళ్లలో బస)

స్టాండర్డ్ ప్యాకేజీ: రూ. 21,900 (థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస)

కంఫర్ట్ ప్యాకేజీ: రూ. 28,450 (సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస)

ప్యాకేజీలో ఇవి ఉన్నాయి:
ఎకానమీ ప్యాకేజీ: స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్-ఏసీ హోటళ్లలో బస, వాహనంలో సైట్ సీయింగ్, భోజనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్.

స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీ: ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనంలో సైట్ సీయింగ్, భోజనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్.

ఈ టూర్ ప్యాకేజీ ద్వారా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను పర్యటించే అనుభవం పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ Divya Dakshin Yatra పేరుతో సెర్చ్ చేయగలరు.

Related News

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Vande Bharat: వందే భారత్ రైలు జర్నీకి బ్రిటన్ దంపతులు ఫిదా, అల్లం చాయ్ అదుర్స్ అంటూ..

Free Travel: అక్కడ బస్సు, రైళ్లలో పిల్లలు పుడితే.. వారికి లైఫ్ టైమ్ జర్నీ ఫ్రీ!

Miniature Train: ఇది దేశంలోనే తొలి సోలార్ పవర్ ట్రైన్.. ఎక్కడ నడుస్తుందో తెలుసా?

Big Stories

×