E-Paper
Advertisement

IRCTC South India Divine Tour : దక్షిణభారత్ టూర్ ప్లాన్.. తక్కువ ధరకే రైలు ప్రయాణం ఎంజాయ్ చేస్తూ ప్రముఖ ఆలయాల దర్శనం

IRCTC South India Divine Tour : దక్షిణభారత్ టూర్ ప్లాన్.. తక్కువ ధరకే రైలు ప్రయాణం ఎంజాయ్ చేస్తూ ప్రముఖ ఆలయాల దర్శనం

IRCTC South India Divine Tour | టూర్లకు వెళ్లాలనుకునే వారికి శుభవార్త! ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి దక్షిణాది రాష్ట్రాల టూర్ ప్యాకేజీ అందిస్తోంది. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను కవర్ చేస్తూ.. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం.

దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఇది 8 రాత్రులు మరియు 9 రోజుల టూర్ ప్యాకేజీ. ఈ టూర్ జూన్ 22న ప్రారంభమవుతుంది. ఈ ప్యాకేజీలో అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

టూర్ వివరాలిలా ఉన్నాయి..
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మొదటి రోజు సికింద్రాబాద్‌లో బయల్దేరుతుంది. సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి స్టేషన్ల నుంచి పర్యాటకులు ఈ టూరిస్ట్ రైలు ఎక్కవచ్చు.

రెండో రోజు: తిరువన్నామలై చేరుకుంటారు. ఇక్కడ అరుణాచలేశ్వర ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

మూడో రోజు: రామేశ్వరం బయల్దేరాలి. ఇక్కడ స్థానిక ఆలయాలను దర్శించుకోవచ్చు. రాత్రికి రామేశ్వరంలో బస చేయొచ్చు.

నాలుగో రోజు: రామేశ్వరం నుంచి మదురై బయల్దేరాలి. సాయంత్రం మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత కన్యాకుమారి బయల్దేరాలి.

ఐదో రోజు: కన్యాకుమారిలో రాక్ మెమొరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్ వంటి ప్రాంతాలను చూడొచ్చు. రాత్రికి కన్యాకుమారిలో బస చేయాలి.

ఆరో రోజు: త్రివేండ్రం బయల్దేరాలి. ఇక్కడ పద్మనాభస్వామి ఆలయం, కోవలం బీచ్‌ను దర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరుచిరాపల్లి బయల్దేరాలి.

ఏడో రోజు: శ్రీరంగం ఆలయం మరియు బృహదీశ్వర ఆలయం దర్శించుకోవచ్చు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

ఎనిమిదో  రోజు: పర్యాటకులు తమతమ స్టేషన్లలో టూరిస్ట్ రైలు దిగడంతో టూర్ ముగుస్తుంది.

Also Read: శివరాత్రి స్పెషల్ టూర్.. యాదాద్రి, శ్రీశైలం సందర్శన

టూర్ ప్యాకేజీలు, ధరలు:
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్లో తెలుసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ ధరలు క్రింది విధంగా ఉన్నాయి:

ఎకానమీ ప్యాకేజీ: రూ. 14,250 (స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్-ఏసీ హోటళ్లలో బస)

స్టాండర్డ్ ప్యాకేజీ: రూ. 21,900 (థర్డ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస)

కంఫర్ట్ ప్యాకేజీ: రూ. 28,450 (సెకండ్ ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస)

ప్యాకేజీలో ఇవి ఉన్నాయి:
ఎకానమీ ప్యాకేజీ: స్లీపర్ క్లాస్ ప్రయాణం, నాన్-ఏసీ హోటళ్లలో బస, వాహనంలో సైట్ సీయింగ్, భోజనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్.

స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీ: ఏసీ ప్రయాణం, ఏసీ గదుల్లో బస, వాహనంలో సైట్ సీయింగ్, భోజనం, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్.

ఈ టూర్ ప్యాకేజీ ద్వారా దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను పర్యటించే అనుభవం పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌ Divya Dakshin Yatra పేరుతో సెర్చ్ చేయగలరు.

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×