E-Paper
Advertisement

IRCTC E-Pantry Service: ఆ రైళ్లలోనూ ఈ-ప్యాంట్రీ సేవలు, ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్!

IRCTC E-Pantry Service: ఆ రైళ్లలోనూ ఈ-ప్యాంట్రీ సేవలు, ప్రయాణీకులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్!

Indian Railways: భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రీమియం రైళ్లలో అందుబాటులో ఉన్న ఈ- ప్యాంట్రీ సేవను ఇప్పుడు మరింత విస్తరిస్తోంది. మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలోనూ ఈ సేవను పరిచయం చేస్తోంది. రీసెంట్ గా వివేక్ ఎక్స్‌ ప్రెస్‌ లో ఈ- ప్యాంట్రీ సేవను ప్రారంభించింది. కొద్ది రోజుల పాటు టెస్ట్ చేసింది. ప్రయాణీకుల నుంచి మంచి స్పందన రావడంతో మరిన్ని రైళ్లకు విస్తరించబోతోంది.

పైలెట్ ప్రాజెక్టు విజయవంతం

ఈ సర్వీసు ద్వారా ప్రయాణీకులు వారి ప్రయాణ సమయంలో పరిశుభ్రమైన భోజనాన్ని ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అధిక ఛార్జీలు, ఆహార నాణ్యత లాంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉండదు. ప్రస్తుతం వివేక్ ఎక్స్‌ ప్రెస్‌ లో పైలట్ ప్రాజెక్టుగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.  ఈ-ప్యాంట్రీ సేవ ద్వారా  ప్రయాణీకులు తమ టికెట్లను బుక్ చేసుకునే సమయంలో భోజనాన్ని ఎంచుకుని  అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ సేవ విజయవంతం కావడంతో, రాబోయే నెలల్లో సుమారు 20 నుండి 25 రైళ్లకు విస్తరించనుంది. ఈ-ప్యాంట్రీ సేవను ఉపయోగించుకోవడానికి, ప్రయాణీకులు IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఫుడ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. నిర్ధారణ తర్వాత,  SMS లేదంటే ఇమెయిల్ ద్వారా ఫుడ్ కన్ఫర్మేషన్ కోడ్ అందుకుంటారు. ప్రయాణ రోజున, ప్రయాణీకులు ఈ కోడ్‌ ను పాంట్రీ కార్ సిబ్బందికి అందజేస్తారు. వారు ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని నేరుగా వారి సీటు దగ్గరికే తీసుకొచ్చి అందిస్తారు.

అధిక ధరల ఇబ్బంది ఉండదు!

ఈ-ప్యాంట్రీ సర్వీసు ప్రధాన లక్ష్యం నగదు లావాదేవీలను తగ్గించడం. బుకింగ్ ప్రక్రియలో చెల్లింపులు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. ఇలా చేయడం వల్ల అధిక ఛార్జీల ఇబ్బంది ఉండదు. భోజన ధరలు స్థిరంగా, పారదర్శకంగా ఉంటాయి.   IRCTC-అధికారిక విక్రేతలు మాత్రమే ముందుగా బుక్ చేసుకున్న భోజనాన్ని డెలివరీ చేస్తారు. నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా భోజనం ఉంటుంది. ఈ సేవ కారణంగా రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.  ఈ-ప్యాంట్రీ సేవ రైల్వే నెట్‌ వర్క్ అంతటా విస్తరిస్తున్నందున, ప్రయాణీకుల సేవలకు మెరుగైన భోజనం అందేలా రైల్వే అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఫుడ్ ఉండేలా ఆయా కాంట్రాక్టు సంస్థలకు రైల్వే ఆదేశాలు జారీ చేసింది.

Read Also: కాశ్మీర్ వందేభారత్ కు ముహూర్తం ఫిక్స్, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం.. ఎప్పుడంటే?

ఈ ప్యాంట్రీ సేవలు రైల్వే ప్రయాణంలో కీలక మార్పుకు కారణం కాబోతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు మరింత సౌకర్యవంతంగా ప్రయాణం చేసేందుకు ఉపయోగపడనున్నట్లు తెలిపారు.  ఇకపై సామాన్యులు కూడా రైల్వే ప్రయాణ సమయంలో నచ్చిన ఆహారాన్ని పొందే అవకాశం ఉంటుంది. అధిక ఖర్చులను నివారించడంతో పాటు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని ఐఆర్సీటీసీ ప్రకటించింది.

Read Also: రన్నింగ్ ట్రైన్ లో యువతి ఓవరాక్షన్, ఫుట్ బోర్డు మీద డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే!

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×