E-Paper
Advertisement

Railway employees benefits: రైల్వే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కోటి రూపాయలతో కొండంత అండ మీకోసమే!

Railway employees benefits: రైల్వే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. కోటి రూపాయలతో కొండంత అండ మీకోసమే!

Railway employees benefits: ఇండియన్ రైల్వే ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్ అందింది. రైల్వే శాఖ ఆధ్వర్యంలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో ఒక పెద్ద ఒప్పందం కుదిరింది. ఈ ఎంఓయూ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు భారీ ఇన్సూరెన్స్ కవర్ అందించబడనుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో ఈ ఎంఓయూపై సంతకాలు చేయడం జరిగింది. దీంతో, ఇప్పటివరకు చిన్న మొత్తంలో మాత్రమే లభించిన ఇన్సూరెన్స్ సదుపాయాలు, ఇప్పుడు మరింత విస్తృతంగా, మరింత భద్రత కలిగించే విధంగా రూపుదిద్దుకున్నాయి.

ఇప్పటి వరకు రైల్వేలో పనిచేస్తున్న గ్రూప్ A, B, C ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద కేవలం గ్రూప్ A ఉద్యోగులకు రూ.1.20 లక్షలు, గ్రూప్ B ఉద్యోగులకు రూ.60 వేలు, గ్రూప్ C ఉద్యోగులకు రూ.30 వేలు మాత్రమే ఇన్సూరెన్స్ లభించేది. కానీ ఈ కొత్త ఒప్పందంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. SBIలో జీతఖాతా ఉన్న రైల్వే ఉద్యోగులకు ఇప్పుడు యాక్సిడెంటల్ డెత్ జరిగితే నేరుగా రూ.1 కోటి రూపాయల ఇన్సూరెన్స్ కవర్ అందుతుంది. ఇది ఉద్యోగులకు, ముఖ్యంగా రిస్క్ ఉన్న పనులు చేసే వారికి, ఒక రకంగా భరోసా కల్పించే నిర్ణయంగా చెప్పుకోవచ్చు.

ఈ ఎంఓయూలో మరొక పెద్ద బెనిఫిట్ ఏమిటంటే, సహజ మరణం జరిగితే కూడా రైల్వే ఉద్యోగులకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కవర్ అందుతుంది. ముఖ్యంగా, ఈ కవర్ పొందడానికి ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు, ఎటువంటి మెడికల్ టెస్టులు కూడా అవసరం లేదు. కేవలం జీత ఖాతా SBIలో ఉండడమే సరిపోతుంది. ఇంత సింపుల్ ప్రాసెస్‌తో ఇంత పెద్ద కవర్ లభించడం ఉద్యోగులకు పెద్ద ప్లస్ పాయింట్.

ఇక ఈ కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్‌లో మరికొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఎయిర్ యాక్సిడెంట్ జరిగి మరణం సంభవించిన సందర్భంలో రూ.1.60 కోట్లు, అలాగే రూపే డెబిట్ కార్డ్ ఆధారంగా అదనంగా రూ.1 కోటి వరకు కవర్ లభిస్తుంది. అదనంగా, ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం ఏర్పడితే (పర్మనెంట్ టోటల్ డిసేబిలిటీ) రూ.1 కోటి రూపాయల వరకు, భాగిక అంగవైకల్యం ఏర్పడితే (పర్మనెంట్ పార్టియల్ డిసేబిలిటీ) గరిష్టంగా రూ.80 లక్షల వరకు ఇన్సూరెన్స్ కవర్ అందుతుంది. ఈ సౌకర్యాలు కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భరోసా కల్పించేలా రూపొందించబడ్డాయి.

దేశవ్యాప్తంగా దాదాపు 7 లక్షల రైల్వే ఉద్యోగులు SBIలో జీతఖాతాలు నిర్వహిస్తున్నారు. ఈ కొత్త స్కీమ్ అమలులోకి రాగానే వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఒక సీనియర్ గ్యాంగ్‌మెన్ మాట్లాడుతూ.. ఇంతకాలం మా కుటుంబ భద్రత కోసం ప్రైవేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సి వచ్చేది.

ఇప్పుడు రైల్వే ఇచ్చే ఈ కవర్‌తో మనం మరింత సేఫ్‌గా ఉన్నామన్న భావన కలుగుతోందన్నారు. మరో సిగ్నల్ ఆపరేటర్ మాట్లాడుతూ.. మా పని ఎప్పుడూ ప్రమాదాల నడుమే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా జరిగితే కనీసం కుటుంబానికి భరోసా ఉంటుంది. ఇది మాకే కాదు, మా కుటుంబానికి కూడా పెద్ద ఉపశమనం అన్నారు.

Also Read: Telangana railways: పాత రూపానికి గుడ్‌బై.. తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌ కు మోడర్న్ టచ్.. సెల్ఫీకి రెడీనా!

ఈ ఎంఓయూలోని ప్రత్యేకత ఏమిటంటే, ఎలాంటి ప్రీమియం లేకపోవడం, ఎలాంటి మెడికల్ టెస్టులు అవసరం లేకపోవడం. కేవలం జీత ఖాతా SBIలో ఉండడం వల్లే ఈ భారీ ఇన్సూరెన్స్ కవర్ అందుబాటులోకి రావడం. రైల్వేలో పనిచేసే ఫ్రంట్‌లైన్ ఉద్యోగులు, ముఖ్యంగా ట్రాక్‌లో పనిచేసే గ్యాంగ్‌మెన్, డ్రైవర్లు, సిగ్నల్ ఆపరేటర్లు వంటి వారు ప్రతిరోజు ప్రమాదాల మధ్య పనిచేస్తారు. ఈ స్కీమ్ వాళ్లకు ఒక రకంగా రక్షణ కవచంలా మారబోతోంది.

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైల్వే ఉద్యోగులు మా బలం. వాళ్ల భద్రత, సంక్షేమం మాకు అత్యంత ప్రాధాన్యం. SBIతో ఈ కొత్త భాగస్వామ్యం ద్వారా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మరింత భరోసా అందించగలుగుతున్నాం. ఇది ఉద్యోగి సంక్షేమానికి ఒక కొత్త మైలురాయని అన్నారు. రాబోయే రోజుల్లో రైల్వే, SBI భాగస్వామ్యం మరిన్ని ఆర్థిక, భద్రతా సేవలకు దారి తీస్తుందని కూడా ఆయన వెల్లడించారు.

ఈ కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ రైల్వే ఉద్యోగుల జీవితాల్లో ఒక పెద్ద మార్పును తెచ్చేలా ఉంది. ముఖ్యంగా, ఒక కోటి రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, 10 లక్షల రూపాయల సహజ మరణం కవర్, అలాగే పలు అదనపు సౌకర్యాలు కలగలిపి ఉద్యోగుల భద్రతకు కొత్త ప్రమాణాలను సృష్టిస్తున్నాయి. రైల్వే ఉద్యోగులు మరియు వారి కుటుంబాల కోసం ఇది ఒక భద్రతా కవచంలా నిలవనుంది.

మొత్తం మీద, ఈ ఎంఓయూతో ఉద్యోగుల సంక్షేమం వైపు రైల్వే ఒక పెద్ద అడుగు వేసింది. ఇది కేవలం ఇన్సూరెన్స్ కవర్ మాత్రమే కాదు, ఉద్యోగుల భవిష్యత్తుకు, వారి కుటుంబ భద్రతకు ఇచ్చిన హామీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×