BigTV English

Secunderabad Tragedy: హనీమూన్ కు వెళ్తూ.. రైలు నుంచి జారి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విషాద ఘటన!

Secunderabad Tragedy: హనీమూన్ కు వెళ్తూ.. రైలు నుంచి జారి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విషాద ఘటన!

Secunderabad Train Accident: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దారుణం జరిగింది. హనీమూన్ కోసం వెళ్తున్న నవ వరుడు రైల్లో నుంచి జారిపడి చనిపోయాడు. నిండు నూరేళ్లు కలిసి తనతో జీవించాలనుకున్న అమ్మాయి జీవితంలో తీరని విషాదాన్ని నింపాడు. కొత్త పెళ్లి కూతురు రోదనలు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించాయి.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

వరంగల్ జిల్లా ఉరకొండకు చెందిన 28 ఏళ్ల సాయికి తాజాగా పెళ్లి అయ్యింది. హనీమూన్ కోసం గోవాకు వెళ్లాలి అనుకున్నాడు. పనిలో పనిగా తన భార్యతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వెకేషన్ కు వెళ్లాలని భావించాడు. అందరూ కలిసి వాస్కోడగామా ఎక్స్ ప్రెస్ ఎక్కారు. రైలు ఇంకా కదలకపోవడంతో సాయి వాటర్ బాటిల్ తెచ్చేందుకు వెళ్లాడు. అతడు వెళ్లగానే రైలు కదలడం మొదలయ్యింది. అతడి భార్య, బావ, బంధువులు రైల్లోనే ఉన్నారు. రైలు నెమ్మదిగా వేగం పుంజుకుంది. సాయి కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించాడు. కోచ్ పక్కనే పరిగెడుతూ జారిపడ్డాడు. రైలు, ఫ్లాట్ ఫారమ్ మధ్యలో పడిపోయాడు. తీవ్రంగా గాయపడ్డాడు.


Read Also:  విశాఖ నుంచి రైల్లో నేరుగా.. ఈ అందమైన ప్రాంతాలకు వెళ్లిపోవచ్చు.. ఈ 4 మిస్ కావద్దు!

హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి

వెంటనే అతడిని బంధువులు సమీపంలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ఐసీయూలో చికిత్స అందించారు.  ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే సాయి చనిపోయాడు. కలిసి జీవితాన్ని పంచుకోవాలనుకునే వ్యక్తి అర్థారంతరంగా చనిపోవడంతో సదరు కొత్త పెళ్లికూతురు గుండెలవిసేలా రోధించింది. సంతోషంగా గడపాలని వెళ్తూ ప్రాణాలు కోల్పోవడంతో బంధుమిత్రులు ఆవేదనలో ముగినిపోయారు. అమ్మాయిని ఓదార్చుతూ, వాళ్లు కూడా కంటతడి పెట్టారు. వారి బాధను చూసి చుట్టుపక్కల వాళ్లంతా కంటతడి పెట్టారు. పోస్టుమార్టం అనంతరం సాయి మృతదేహాన్ని ఆయన స్వస్థలానికి తీసుకెళ్లనున్నట్లు బంధువులు తెలిపారు. ఈ విషయం తెలియడంతో ఆయన స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు ఈ ఘటనకు సంబంధించి రైల్వే అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Read Also:  రైల్వే ప్రయాణంలో ఆధార్ ధృవీకరణ, అనుమానం వస్తే అంతే సంగతులు!

Related News

Vande Bharat Express: వందే భారత్ తయారీలో ఇంత పెద్ద తప్పు జరిగిందా? అయినా నడిపేస్తున్నారే!

Godavari Express: ప్రయాణీకుడికి గుండెపోటు, కాజీపేట స్టేషన్ లో నిలిచిపోయిన గోదావరి ఎక్స్ ప్రెస్!

Nose Kiss: అరబ్ దేశీయులు ముక్కుతో ముద్దులు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

Fully Digital Airport: ఇది సాదా సీదా ఎయిర్ పోర్ట్ కాదు.. మొత్తం డిజిటల్, ఈ రోజే ప్రారంభం!

Underwater Train: నదీ గర్భంలో 33 మీటర్ల లోతులో.. చిరుతలా దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?

Diwali Special Trains: పండుగ వేళ మరిన్ని ప్రత్యేక రైళ్లు, ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్!

Tourism in AP: ఏపీలో పర్యాటకానికి హౌస్‌ బోట్లు.. పగలు జల విహారం, రాత్రికి అందులో బస

Passengers Fined: టికెట్ లేని ప్రయాణంపై ఉక్కుపాదం, 5 నెలల్లో ఏకంగా రూ. 100 కోట్లు వసూలు!

Big Stories

×