Eeshwar Sai Wife Controversy:ఈశ్వర్ సాయి ,మాధురి రాథోడ్ ల వ్యవహారం రాజేసిన మంటలు ఇప్పట్లో ఆగేలా చల్లారేలా కనిపించట్లేదు.ఈ క్రమంలోనే తాజాగా ఈశ్వర్ సాయి భార్య ఫోక్ ఇండస్ట్రీ పై చేసిన కామెంట్స్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.అయితే వీటిపై స్పందించిన శేఖర్ వైరస్ (Shekar Virus) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈశ్వర్ సాయి (Eeshwar Sai) భార్య ఇటీవల ఫోక్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఫోక్ రంగానికి ఆమె తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
గడిచిన ఎనిమిదేళ్లుగా తాను జానపద రంగానికే కాకుండా అనేక సినిమాల్లో డ్యాన్సర్గా, కళాకారుడిగా సేవలు అందిస్తున్నానని శేఖర్ వైరస్ గుర్తుచేశారు. ఈశ్వర్ సాయి కుటుంబంలో తలెత్తిన వ్యక్తిగత వివాదాలను, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఫోక్ రంగాన్ని లాగడం ఎంతమాత్రం సరికాదని స్పష్టం చేశారు.
“మీ ఇంట్లో లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి మీ వ్యక్తిగతం. అంతేకాని వాటిని ఫోక్ ఇండస్ట్రీకి ముడిపెట్టి మాట్లాడటం సరైన పద్ధతి కాదు” అని మండిపడ్డారు.
తెలంగాణ జానపద రంగానికి సుదీర్ఘ చరిత్ర మరియు గొప్ప సంస్కృతి ఉందనే విషయాన్ని గుర్తించాలని శేఖర్ వైరస్ చెప్పారు. “ఈ ఇండస్ట్రీలో ఎంతోమంది మంచి సంస్కారం ఉన్న అమ్మాయిలు, ప్రతిభావంతులైన డ్యాన్సర్లు ఉన్నారు. కేవలం ఒకరిద్దరి ప్రవర్తన ఆధారంగా మొత్తం ఫోక్ ఇండస్ట్రీనే తక్కువ చేసి మాట్లాడటం కేవలం ముమ్మాటికీ తప్పే” అని అన్నారు.
ఫోక్ ఇండస్ట్రీ ఆధారంగా చేసుకుని ఎన్నో పేద కుటుంబాలు, కళాకారులు జీవనం సాగిస్తున్నారని, అలాంటి రంగానికి మచ్చ తెచ్చేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
also read:ఈశ్వర్ సాయి-మాధురి వ్యవహారంపై భార్య ఫస్ట్ టైమ్ ఓపెన్.. అసలు కథ ఇదే!
ఈ సందర్భంగా శేఖర్ వైరస్ ఒక డిమాండ్ పెట్టారు. ఫోక్ ఇండస్ట్రీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు గాను ఈశ్వర్ సాయి భార్య ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతె సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, వివాదాలకు ఆమె బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఇకపై ఎవరైనా ఫోక్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడితే చట్టపరమైన, సామాజికపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇక ఈ వివాదంలో సీనియర్ డ్యాన్స్ మాస్టర్లు మరియు రంగానికి చెందిన ఇతర ప్రతినిధులు కూడా శేఖర్ వైరస్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. గత 20 ఏళ్లుగా జానపద కళలను, పాటలను ఎంతో కష్టపడి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లామని, అటువంటి పవిత్రమైన వేదికపై ఇటువంటి మచ్చ పడటం బాధాకరమని సీనియర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
also read:తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!
సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్ ఇంటర్వ్యూలు మరియు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ప్రస్తుతం ఈ వివాదం బాగా ట్రెండ్ అవుతోంది.