Intinti Ramayanam Today Episode august 22nd: ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఆఫీస్ కి వెళ్ళాలి అని రెడీ అవుతూ ఉంటారు. ముందుగా శ్రీకర్ నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అయితే అక్షయ్ కూడా ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతాడు. కానీ కమల్ మాత్రం రెడీ అవ్వడానికి ఇష్టపడకుండా ఆఫీసుకు వెళ్లడానికి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతాడు. అయినా పర్వాలేదు నువ్వు ఆఫీస్ కి రావాల్సింది అని అక్షయ్ కండిషన్ పెడతాడు. ఇది ఇంట్లో పూజ ఉంది మీరందరూ పూజకు తొందరగా రావాలి అని అవని అంటుంది. ఇక అందరూ అవినీతో చెప్పి ఆఫీసులకు వెళ్లిపోతారు. నీకు ఇంట్లో పూజ ఉంది కదా అందరూ కలిసి పూజకి సిద్ధం చేయాలి అని పార్వతి చెప్పగానే అవనీని శ్రేయ కి పల్లకి కూడా పనులు చెప్పాలి అని పార్వతీ చెప్తుంది..
పల్లవి ఖాళీగా ఉంది అని తనకి అక్కడున్న పూజ సామాన్లను కడగమని అవని చెప్తుంది.. ఆ మాట వినగానే.. పల్లవి సరే అక్క నేను వెంటనే చేస్తాను అని అంటుంది.. ఇక పల్లవి దీపపు సామాన్లు అన్నిటిని తీసుకుని బయట కూర్చుని కడగడానికి వెళ్తుంది. అయితే అక్కడికొచ్చిన మీనాక్షి నేను కడుగుతాను అని ఎంతగా చెబుతున్నా సరే పల్లవి మాత్రం అవని అక్క నాకే చెప్పింది.. కాబట్టి నేనే కడుగుతాను అని అంటుంది. ఇక మీనాక్షి కూడా వచ్చి పల్లవికి తోడుగా కూర్చుంటుంది. కానీ పల్లవి మాత్రం నేను చేస్తానమ్మా అని అనగానే అటు భానుమతి పల్లవిలో ఇంత మార్పుని అస్సలు ఊహించలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే పల్లవి కడుగుతూ ఉండగా సబ్బు కళ్ళల్లో పడిపోవడంతో మీనాక్షి విలవిలలాడిపోతుంది.
అవని పల్లవి చేస్తున్న పనులలో సాయం చేసి తనతో సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. పని మనుషులతో పని చేయించుకోవచ్చు నా మనవరాలు ఇలా పని మనుషులతో పని చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని భానుమతి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ పల్లవి మాత్రం చాలా సంతోషంగా అక్కడున్న పనులన్నీ చేస్తూ ఉంటుంది. మొత్తానికి పల్లవి తో చాలా సంతోషంగా ఉంటారు ఇంట్లో ఇవాళ అందరూ.. ఇక తర్వాత భానుమతి భోజనం ఎక్కువ చేశాను అని అడగలేదు అని అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండగా పార్వతి ఏంటి అత్తయ్య ఈ టైంలో వాకింగ్ చేస్తున్నారు అని అంటుంది.. ఏమీ లేదు ఊరికే చేశానని లోపలికి వెళ్ళిపోతుంది అయితే అప్పుడే ఆరాధ్య లోపలికి రావడంతో భానుమతి ఏంటి అప్పుడే వచ్చావు అని అడుగుతుంది ఉదయం జరిగిన దానికి ఆరోగ్య కక్షలు పెట్టుకొని భానుమతిని స్వీట్ చూపించి ఆడుకుంటుంది.. భానుమతి పరిగెత్తి పరుగెత్తి అలసిపోయి కూర్చుంటుంది. నాకు ఒక్క స్వీట్ ఇవ్వవే అంటూ భానుమతి ఆరాధ్యును బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ఆరాధ్య మాత్రం నన్ను ఇరికిస్తావా అందుకే నీకు ఇలా ఆడుకుంటున్నాను అని అంటుంది..
అందరు ఇంట్లో పూజకు సిద్ధం చేస్తూ ఉండగా.. భానుమతి ఆరాధ్య ఇద్దరు కలిసి బాబుతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే సడన్గా చక్రధరి ఇంట్లోకి రావడంతో అందరూ నాన్న వచ్చాడు అని అక్కడికి వెళ్తారు. చక్రధర్ ఇంట్లో అందరికీ పూజ కాబట్టి బట్టలు తీసుకురావాలని అనుకుంటాడు. అయితే అన్నని పిలిచి బట్టలు పెడతాడు. మన ఇద్దరమ్మాయిలు పూజ చేసుకుంటున్నారు కదా.. అని అనగానే మీనాక్షి ముగ్గురు అమ్మాయిలు అండి శ్రీయ కూడా మనం అమ్మాయే అని అంటుంది.. ఇక అందరికీ బట్టలు పెడతారు.. అందరూ కలిసి బట్టలు తీసుకుని చాలా సంతోషంగా ఉంటారు. అయితే అందరూ సంతోషంగా పూజ కోసమని రెడీ చేస్తూ ఉంటారు. ఇక ఆరాధ్య తన తమ్ముడితో మాట్లాడలేదు అంటూ చక్రధారిని అనడంతో తను కూడా సరదాగా మనవడు ఎత్తుకోని ఆడుకుంటాడు. ఇక అందరూ సరదాగా ఇంట్లో వరలక్ష్మీ వ్రతం చేసేందుకు సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక సాయంత్రం పూజ ఉంది కదా అని అందరూ రెడీ చేస్తూ ఉంటారు కానీ అశ్విన్ నన్ను జైలుకు పంపిస్తావా అంటూ పల్లవి పై కక్షలు పెంచుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో చక్రధర్ పల్లవికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డబ్బులు ఇస్తాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :ఇంత షాక్ ఇచ్చిందేంటి..? ఆ ఒక్కటే కారణమా..?